Pooja Hegde: టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల తార పూజా హెగ్డే గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటిగా ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడు తన అందంతో ఎంతో మంది అభిమానులు ఆకట్టుకుంది. ఇక గత సంవత్సరం విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ సినిమా లో ఈ అమ్మడు తన అందాలను ఒక రేంజ్ లో కనబరిచింది.
ఇక ఈ సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత పూజా హెగ్డేకు రోజులు కలిసి రావడం లేదు. తాను చేసిన సినిమా లు పూర్తిగా ప్లాప్ అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇటివలే సైమా అవార్డ్స్ నేపథ్యంలో పూజ హెగ్డే కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటనకు గాను బెస్ట్ హీరోయిన్ అవార్డు ఇచ్చారు. కానీ ఈ అమ్మడు అవార్డు దక్కించుకున్నప్పటికీ ఏ మాత్రం సుఖం లేకుండా పోయింది.
ఎందుకంటే లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఆ సినిమాలో తన పర్ఫామెన్స్ మరో స్థాయిలో ఉంది. ఇక నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా మెప్పించి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మరో స్థాయిలో కట్టిపడేసింది. మరి నటనను ఈ విధంగా కనబరిచిన సాయి పల్లవికి బెస్ట్ హీరోయిన్ అవార్డు ఇవ్వకుండా సైమా వాళ్లు పూజ హెగ్డే కి ఎలా ఇస్తారని నెటిజన్లు అడుగుతున్నారు.
ఈ విషయం పై పూజా హెగ్డే ను నెటిజన్లు ఒక రేంజ్ లో దెప్పిపొడుస్తున్నారు. అంతేకాకుండా పూజ హెగ్డే ఈ అవార్డును డబ్బులు ఇచ్చి దక్కించుకుందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విధంగా పూజ హెగ్డే అవార్డును గెలుచుకున్నప్పటికీ.. తనకు ఏమాత్రం సుఖం లేకుండా పోయింది.