Babloo Prudhvi Raj: బబ్లూ పృథ్వీరాజ్ తెలుగు చలనచిత్ర నటుడు. ఇతను తమిళం, తెలుగు, కన్నడ భాషలలో కూడా నటించాడు. ఇతను 1990 నుండి 2000 వరకు తమిళ టెలివిజన్ సీరియల్ లలో ఎక్కువగా నటించడం జరిగింది. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా కెరియర్ ప్రారంభించాడు.
తన మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని బబ్లూ పృథ్వీరాజ్ అయ్యాడు. అమ్మ మనసు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇక తెలుగులో పెళ్లి సినిమాలో చేసిన నెగటివ్ రోల్ ఎన్నటికీ మర్చిపోలేము. ఉత్తమ విలన్ గా నంది అవార్డు గెలుచుకున్నాడు.
ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న ఇతనికి తన కుమారుడి అహద్ పరిస్థితి చూసి తీవ్రంగా కుంగిపోతున్నాడు. ఆహాద్ చిన్నప్పటినుండి ఆటిజం అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆహాద్ ఆటిజంతో బాధపడుతున్నాడు.
అతడు ఎవరితోనూ కలవడని, అతడి ప్రపంచంలో అతడు సంతోషంగా ఉంటాడు. ఇది కేవలం చిన్న లక్షణాలు మాత్రమే.. ఆటిజం లో ఇంకా పెద్ద లక్షణాలు చాలా ఉన్నాయి. ఆటిజం వచ్చినవారు నేర్చుకోవడంలో వెనుకబడి ఉంటారు. మనమే వారికి అన్ని నేర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అతడి వయసు 27 ఏళ్లు.
అతనికి మాటలు రావు కానీ చెప్పిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటాడు. నాకు ఒక్కడే కుమారుడు. రెండో బిడ్డకు కూడా ఆటిజం వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. ఒకవేళ రెండవ బాబు మామూలుగా పుట్టిన కూడా ఆహద్ ను సరిగ్గా పట్టించుకోమన్న ఉద్దేశంతో రెండో బిడ్డ వద్దు అనుకున్నాము.
పుట్టినప్పుడు తెలియదు కానీ, అతనికి మూడు సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు తెలిసింది ఆటిజం ఉందని. ప్రస్తుతానికి తన పనులు తాను చూసుకుంటున్నాడని తన విషయంలో భార్య చాలా కేర్ తీసుకుంటుందని తెలపడం జరిగింది. బాబు విషయంలో వెంకటేష్ గారు నాకు మంచి మాటలు చెప్పారు అని పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఈయన తమిళ బుల్లితెరపై గలాట్ట కుటుంబం, మతి యోసి వంటి షో లతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.