Prudhvi Raj: పవన్ పెళ్లిళ్లతో పోలవరం ఆగిందా.. పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!

Prudhvi Raj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ తాను పవన్ కళ్యాణ్, చంద్రబాబు వదిలిన బాణాన్ని అంటూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఆయన ఎందుకు అలా అన్నారంటే వచ్చే ఎన్నికలలో మీరు పోటీ చేసే అవకాశం ఉందా అని ఒక జర్నలిస్ట్ పృధ్వీరాజ్ ని అడిగితే అందుకు సమాధానం ఈ విధంగా చెప్పుకొచ్చారు పృధ్వీరాజ్. నేను ఎన్నికల్లో పోటీ చేయను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బదిలీన బాణం నేను. ప్రచారానికి వస్తాను కానీ పోటీ చేయను.

 

అంబటి కి ప్రాజెక్టుల గురించి అసలు ఏం తెలుసు? ఎప్పుడైనా ప్రాజెక్టుల గురించి మాట్లాడారా డాన్సులు, సినిమాలు, కలెక్షన్లు, డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడే వాళ్ళు మినిస్టర్లా.. రాంబాబు ఎప్పుడు మూడు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓటమి గురించి మాట్లాడుతారు కాని ప్రాజెక్టుల గురించి ఏనాడైనా మాట్లాడారా అంటూ తీవ్ర స్థాయిలో అంబటి రాంబాబు పై విమర్శనాస్త్రాలు ప్రయోగించారు. అంబటి రాంబాబు మాట్లాడితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి మాట్లాడుతారు ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వలన పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందా..

లేకపోతే అభివృద్ధి నిలిచిపోయిందా అంటూ నిలదీశారు. లోకేష్ వద్ద రెడ్ డైరీ ఉంది, నా దగ్గర పిఆర్ డైరీ ఉంది ఆ డైరీ బయటకు తీస్తా అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీకాళహస్తి వరకు తనను వాడుకుని వదిలేసిన అధికార పార్టీ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అన్నారు. మూడు రాజధానుల పేర్లు చెప్పి అసలు రాజధాని లేకుండా చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 

136 స్థానాలతో జనసేన, తెలుగుదేశం మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని 21 ఎంపీ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు సీట్లు మార్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరు అన్నారు. బూతుల మినిస్టర్లు, బూతుల యూనివర్సిటీ కుప్పకూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పృధ్విరాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -