Warangal: జాబ్ రాలేదని అలాంటి పని చేసిన డిగ్రీ విద్యార్థి?

Warangal: ప్రస్తుత రోజుల్లో చాలామంది యువత చిన్న చిన్న వాటికే ఊహించని నిర్ణయాలు తీసుకొని సూసైడ్ లకు పాల్పడుతున్నారు. పిల్లల్ని పెంచి పెద్దచేసి మంచి ప్రయోజకులను చేయాలి అనుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. చదువుకున్న యువతి ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆశ్చర్యపోవాల్సిన విషయం. నీ సమయంలో ఆత్మహత్యా తప్పు అని చదువుకొని ఉన్న విద్యార్థులే ఈ విధంగా ఊహించని విధంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కొందరు ప్రేమ విషయంలో ఆత్మహత్య చేసుకుంటుండగా మరికొందరు చదువుల విషయంలో ఆత్మహత్యలు చేసుకుంటారు.

 

తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. వరంగల్‌ జిల్లాలో 16వ డివిజన్‌ ధర్మారంలో నివసిస్తున్న ఊదర రవికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద అమ్మాయిలు ఇద్దరికి ఇప్పటికే వివాహం అయ్యింది. చిన్న కుమార్తె మేఘన డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది మేఘన. అయితే ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్న కూతుర్ని అలా ఉరితాడుకు వేలాడుతూ చూసేసరికి మేఘనా తల్లిదండ్రులు గుండెలు పిలిచేలా రోదించారు. మృతురాలు తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

కాగా మేఘన డైరీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ డైరీలో మేఘన తన బాధను వ్యక్తం చేస్తూ డిగ్రీ వరకు చదివిన నేను.. నా కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి సహాయం చేయలేకపోతున్నారు. నా తల్లిదండ్రులు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. మా నాన్న ఆరేళ్ల క్రితం మద్యం మానేసి, మాతో బాగానే ఉంటున్నాడు, బాగా చూసుకుంటున్నాడు. డిగ్రీ పూర్తి చేసినా జాబ్‌ రావడం లేదనే సమస్య నన్ను కుదురుగా ఉండనీయడం లేదు. ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాను అంటూ తన మనసులో గూడుకట్టుకున్న వ్యధను వెల్లడించింది మేఘన.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -