Pawan Kalyan: టాలీవుడ్ ప్రతిష్టను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి. ఒక్కో సినిమాతో తన స్థాయితో పాటు తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచారాయన. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ లో సంచలనం రేపారు. మ్యాగ్నమాపస్ మూవీస్ అంటే ఏంటో కొత్త నిర్వచనం చెప్పారాయన.
‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి పాన్ ఇండియా హిట్ కొట్టారు జక్కన్న. ఈ సినిమా ఇండియాతోపాటు అమెరికా, జపాన్ ల్లోనూ సంచలనం సృష్టించింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ఫారిన్ ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ఇక నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా వరుసగా పలు వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగింది. తదుపరి రాజమౌళి నుంచి వచ్చే సినిమా కోసం ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ లో తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ లెవల్లో తీయనున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత తదుపరి చిత్రాన్ని ఎవరితో తీస్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మినహా దాదాపుగా అందరు టాలీవుడ్ టాప్ స్టార్స్ తోనూ రాజమౌళి సినిమాలు తీసేశారు.
బన్నీ, పవన్ కలసి ఒకే మూవీలో..?
రాజమౌళి–పవన్, రాజమౌళి–అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీళ్ల కలయికలో మల్టీస్టారర్ తీయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ మూవీలో బన్నీ రోల్ ఫుల్ లెంగ్త్ లో ఉంటుందని వినికిడి. పవన్ కల్యాణ్ పాత్ర దాదాపుగా 40 నిమిషాలకు అటూఇటుగా ఉంటుందని టాక్. ఈ చిత్రం బడ్జెట్ సుమారుగా రూ.1,000 కోట్లు అని నెట్టింట పుకార్లు వస్తున్నాయి. మరి, దీంట్లో ఎంత నిజం ఉందనేది రాజమౌళికే తెలియాలి.