Anu Emmanuel: డైరెక్టర్ త్రివిక్రమ్ వల్ల అను ఇమ్మానియేల్ జీవితం ఇలా మారిందా?

Anu Emmanuel: టాలీవుడ్ ప్రేక్షకులకు అను ఇమ్మానియేల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మజ్ను సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైనా అను ప్రేక్షకులను మంచిగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో నటించింది. కానీ ప్రేక్షకులను ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. అనంతరం ఆక్సిజన్ సినిమాలో నటించినప్పటికీ ఈ సినిమా పూర్తిగా ఓటమిపాలైంది.

అలా అను ఇమ్మానియేల్ ఏ సినిమాలో నువ్వు మంచి గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత చాలా రోజులకి అప్పట్లో త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించడానికి అను ఇమ్మానియేల్ కి ఆఫర్ చేశాడు. ఈ ఆఫర్ తన చెవిలో పడిన వెంటనే అనూకి ఎక్కడ లేని ఆనందం కలిగినట్లుంది. అంతేకాకుండా తన కేరియర్ ను మూడు పువ్వుల ఆరు కాయలు ఊహించుకుంది. సమంత, కాజల్ అగర్వాల్ రేంజ్ లో తన స్టార్ డమ్ ఊహించుకుంది.

ఇక అజ్ఞాతవాసి సినిమా కి కూడా అప్పట్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఎంతలా అంటే అత్తారింటికి దారేది సినిమాని మించి ఈ సినిమా ఉంటుందని అప్పట్లో ప్రేక్షకులు భారీ అంచనాలు వేసుకున్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ సినిమా గురించి మరో స్థాయిలో ప్రచారాలు చేశారు. ఈ సినిమాలో చెస్తే అను కేరియర్ కూడా మారిపోతుందనుకుంది. కానీ ఈ సినిమాను త్రివిక్రమ్ ఊహించే స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.

ఈ సినిమా పూర్తిగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన అను ఇమ్మానియేల్ పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది. ఇక అప్పటినుంచి ఈ అమ్మడు కి అంతగా సినిమా అవకాశాలు కూడా రాలేదు. అటు తమిళ ఇండస్ట్రీలో ట్రై చేసినప్పటికీ.. తమిళంలో కూడా మెప్పించలేకపోయింది అమ్మడు. మొత్తానికి అటు తమిళ్ ఇండస్ట్రీకి ఇటు తెలుగు ఇండస్ట్రీ కి కాకుండా పోయింది. ఈ విధంగా అను ని త్రివిక్రమ్ నమ్మించి మోసం చేశాడు అన్నట్లు నెటిజన్లు అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -