Actress Sangeetha: ఒకప్పుడు సంగీత అంటే తెలియని వారుండేవారు. ఇప్పుడు కాస్త సినిమాలకు దూరం కావడంతో అంతగా గుర్తు పట్టడం లేదు. తెలుగు, తమిళ, కన్నడ మలయాళంలో ఎన్నో సినిమాలకు హిట్టిచ్చిన చెన్నై కుట్టి ఇటీవల ఓ షోలో చెప్పి మాటలు వైరల్ అవుతున్నాయి. ఒక్కఛాన్స్.. ఒకే ఒక్కఛాన్స్ అంటూ రవితేజ నటించిన ఖడ్గం మూవీ చెప్ని డైలాగ్తో రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులను ఆకట్టుకుంది.
ఆ సినమా తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి తదితర విజయవంతమైన చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోయిన్తో పాటు గ్లామరస్ నటిగా పేరు సంపాదించింది. ప్రస్తుతం సంగీత అప్పుడప్పుడూ టీవీ షోస్లలో కనబడుతూ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మూవీస్ చేస్తోంది. 2010లో కారా మజాకా సినిమాలో నటించిన సంగీత ఆ తర్వాత దాదాపుగా10 తెలుగు తెరపై కనిపించలేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘‘సరిలేరు నీకెవ్వరు’’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ రష్మికతో కలిసి ‘అబ్బబ్బా నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’ అనే సరికొత్త మేనరిజంతో ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది రిలీజైన ‘ఆచార్య’లో లాహే లాహే పాటలోనూ కనిపించింది. ‘మసుధ’ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ‘అలీతో సరదాగా’ షోకి వచ్చిన సంగీత కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది.
సరిలేరు నీక్వెవరు సినిమాలో హీరోయిన్ తల్లిగా చేశావ్. అది నీకు ప్లస్ అయిందా.. మైనస్ అయిందా అని హోస్ట్గా అలీ అడగా.. రెండూ అయిందని చెప్పింది. డైరెక్టర్ అనిల్ ని చూస్తే ‘రేయ్ ఇలా చేశావ్ రా నన్ను’ అని తిట్టుకుంటూనే ఉంటానని సంగీత చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అవకాశం వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా అని అలీ ప్రశ్నించగా ఓ సినిమా షూటింగ్ కి రెండు రోజులు వెళ్లానని.. ఆ తర్వాత వాళ్లు చిత్రం నుంచి తీసేశారని సమా«ధానం చెప్పింది. ప్రోమోలో ఆ మూవీ ఏంటనేది రివీల్ చేయలేదు కాబట్టి ఆ సినిమా ఏంటనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అని సంగీత ఆ షోలో తన మనసులో మాట చెప్పేసింది.