Tarakaratna Wife: నందమూరి వంశం నుంచి ఇండస్ట్రీలోకి వారసులుగా వచ్చినటువంటి వారిలో తారకరత్న కూడా ఒకరు.ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి తారకరత్న ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ కానటువంటి ఈయన వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలని భావించారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొని గుండెపోటుకు గురయ్యారు.
ఇలా గుండెపోటుకు గురైన తారకరత్న దాదాపు 23 రోజులపాటు బెంగళూరులో చికిత్స పొందుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా తారకరత్న మరణించడంతో ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి చాలా ఎమోషనల్ అయ్యారు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇలా శాశ్వతంగా తనకు దూరం కావడంతో ఆ బాధను అలేఖ్య రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు.ఇలా తన భర్త లేరని చేదు నిజాన్ని గుర్తు చేసుకుంటూ తన భర్తతో గడిపిన ఆనంద క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కుటుంబం మొత్తం ఎలివేయడంతో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ధైర్యంగా జీవితంలో నిలబడ్డామని అయితే తారకరత్న అర్థంతరంగా మరణించడంతో తాను ఒంటరిని అయ్యాననే భావన తనని ఎంతగానో కృంగదీస్తుంది. అయితే తారకరత్న జ్ఞాపకాల నుంచి బయటపడలేక మానసికంగా ఎంతో కృంగిపోయిన ఈమె మానసిక ప్రశాంతత కోసం కొద్ది రోజుల పాటు మెడిటేషన్ చేయాలని భావించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో ఈమె కొద్ది రోజులపాటు ఉంటూ అక్కడే మెడిటేషన్ చేస్తూ తనని మానసికంగా దృఢపరుచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక అలేఖ్య రెడ్డితో పాటు తన పెద్ద కుమార్తె నిష్క సైతం తన తల్లితో పాటు కోయంబత్తూర్ వెళ్తున్నట్టు సమాచారం.ఏది ఏమైనా ప్రేమను గెలిపించుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడి అవమానాలను ఎదుర్కొని ఒకటైనటువంటి ఈ జంటను భగవంతుడు ఇలా అర్ధాంతరంగా విడదీయడంతో అలేఖ్య ఎంతగానో కృంగిపోతుందని తెలుస్తోంది.