Taraka Ratna Wife: దీనస్థితిలో తారకరత్న భార్య.. ఎవరూ ఆదుకోవడం లేదా?

Taraka Ratna Wife: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారకరత్న సినిమాలలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో రాజకీయాలలో రాణించాలని భావించారు. ఈ క్రమంలోనే జనవరి 27వ తేదీ లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు ఒకసారిగా గుండెపోటు రావడంతో ఈయన స్పృహ తప్పి పడిపోయారు.ఈ క్రమంలోనే మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించగా 23 రోజుల పాటు చికిత్స తీసుకొని ఫిబ్రవరి 18వ తేదీ తారకరత్న మరణించిన విషయం మనకు తెలిసిందే.

తారకరత్న మరణించడంతో తన భార్య అలేఖ్య రెడ్డి పిల్లలు ఒంటరి వారు అయ్యారు.తారకరత్న తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా అలేఖ్యను వివాహం చేసుకోవడంతో ఆయన తల్లిదండ్రులు తనని దూరం పెట్టారు.ఇలా తల్లిదండ్రులు దూరం పెట్టడంతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంతో కష్టపడిన తారకరత్న ఇలా అర్ధాంతరంగా మరణించడంతో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఒంటరిగా మిగిలిపోయారు.

ఇక ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా ముగ్గురు పిల్లలతో కలిసి అలేఖ్య ఒంటరిగా ఉంటున్నారు.ఇక ఈయన మరణించి నేటికి రెండు నెలలు పూర్తి అయ్యాయి.ఇలా తన భర్త మరణించి రెండు నెలలు అయినప్పటికీ అలేఖ్య రెడ్డి మాత్రం తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడలేదని తెలుస్తోంది. తరచూ సోషల్ మీడియా వేదికగా తన భర్తను తలుచుకుంటూ ఈమె షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తారకరత్న మరణించడంతో బాలకృష్ణ తన కుటుంబానికి అండగా ఉంటారని మాట ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నటువంటి బాలకృష్ణ తనకు కొంత మొత్తంలో డబ్బు పంపిస్తున్నప్పటికీ తనకు,తన పిల్లల ఖర్చులకు కూడా ఆ డబ్బు సరిపోకపోవడంతో ఈమె ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది.ఇలా తారకరత్న మరణించిన తర్వాత అలేఖ్య రెడ్డి పరిస్థితి చాలా కష్టతరంగా మారిందని తెలుస్తోంది. ఒకవైపు భర్త మరణం మరొకవైపు ఆర్థిక ఇబ్బందులు అలేఖ్య రెడ్డిని కృంగదీస్తున్నాయని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -