Allu Arjun: ఆ విషయంలోనే సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా పుష్పరాజ్!

Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ మొదటి సినిమా ఎంతో మంచి హిట్ అయినా ఎంతోమంది ఈయన బాడీ షేమింగ్ గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.ఈయన రూపురేఖలు ఏమాత్రం బాగాలేవని హీరో కటౌట్ కాదంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.అయితే ఒకప్పుడు విమర్శించిన వాళ్లే ప్రస్తుతం ఈయన స్టైల్, మేనరిజం అనుకరిస్తూ ఇతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇలా ఇండస్ట్రీలో ఒక్కో సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఏకంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయి హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.పుష్ప సినిమా ముందు వరకు దక్షిణాది సినీ ఇండస్ట్రీలోని అగ్ర హీరోగా పేరు సంపాదించుకున్న ఈయన పుష్ప సినిమాతో ఊహించని విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక పుష్ప సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ కు అభిమానుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయిందని చెప్పాలి.

ఇక పుష్ప సినిమాతో కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా అల్లు అర్జున్ కి అభిమానులు సంఖ్య పెరిగిపోయింది.ఇక పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో వరుస యాడ్స్ చేస్తూ ఎంతో స్టైలిష్ లుక్ లో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈయన స్టైల్ కు ఫిదా అయిన ఎంతోమంది ఈయనకు అభిమానులుగా మారిపోయారు.ఈ విధంగా రోజురోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్న అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ లో సరికొత్త రికార్డు సృష్టించారు.

ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరో సాధించలేని రేర్ ఫీట్ అల్లు అర్జున్ సాధించారు. ఇంస్టాగ్రామ్ లో ఈయన ఏకంగా 19 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకొని మరొక రికార్డు సృష్టించారు. ట్విట్టర్లో మహేష్ బాబు ముందు వరుసలో ఉండగా ఇంస్టాగ్రామ్ లో మాత్రం అల్లు అర్జున్ హవా కొనసాగుతుంది. ఇక అల్లు అర్జున్ తర్వాత 17.3 మిలియన్ ఫాలోవర్స్ తో విజయ్ దేవరకొండ రెండో స్థానంలో ఉన్నారు.మొత్తానికి ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి సౌత్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -