Allu Sneha Reddy: టాలీవుడ్ ప్రేక్షకులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ద్వారా బన్నీ.. పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్నాడు.
ఏదేమైనా బన్నీ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక బన్నీ భార్య స్నేహారెడ్డి గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తో సమానంగా స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక వీరిద్దరి దంపతులు కు సోషల్ మీడియాతో ఉన్న ర్యాపో అంతా ఇంతా కాదు.
వీరిద్దరికి సంబంధించిన ఎటువంటి ఫోటో అయినా సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఇక వీరిద్దరికి ఏమాత్రం ఖాళీ దొరికినా కూడా.. పలు వెకేషన్స్, టూర్స్ పేరుతో తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా స్నేహ రెడ్డి స్పెయిన్ కి సోలో ట్రిప్ వేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి. నిజానికి అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన ఎటువంటి ఫోటోలైన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి.
ఇక ఇదే క్రమంలో స్నేహ రెడ్డి స్పెయిన్ ట్రిప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరు కూడా ఆ ఫోటోలు వైపు ఒక లుక్కేయండి. ఇక అల్లు అర్జున్ రాబోయే సినిమాల విషయానికి వస్తే.. పుష్ప ద రూల్ సినిమా నవంబర్ 18న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక ఇదే క్రమంలో AA 21 అనే ప్రాజెక్టు కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.