Gorantla Butchaiah Chowdary: టిడిపి జనసేన కూటమి నుంచి 99 అభ్యర్థుల స్థానాలను ప్రకటిస్తూ జాబితా విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ జాబితాలో కొందరు సీనియర్లకు చోటు దక్కకపోవడంతో తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఈ జాబితాలో పేర్లు లేనటువంటి వారందరిని ఆదివారం చంద్రబాబు సముదాయించే పనిలో ఉన్నారని తెలుస్తోంది.
ఇలా ఈ జాబితాలో లేనటువంటి వారికి స్వయంగా చంద్రబాబు నాయుడు ఫోన్లు చేయడమే కాకుండా కొంత మందితో తన నివాసంలో కూడా భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజమహేంద్రవరం రూరల్ స్థానం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నుంచి కూడా ఈ స్థానం నుంచి కందుల దుర్గేష్ కూడా టికెట్టును ఆశిస్తున్నారు. ఇలా ఇద్దరు ఈ సీటు కోసం పోటీపడుతున్నటువంటి తరుణంలో చంద్రబాబునాయుడు సందిగ్ధంలో ఉంటూ వీరి పేర్లను ప్రకటించలేదు.
ఇలా వీరి పేర్లు జాబితాలో లేకపోవడంతో చంద్రబాబు నాయుడు స్వయంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి రాజమహేంద్రవరం రూరల్ నుంచి తాను తప్పకుండా పోటీ చేస్తారని త్వరలోనే ఆ విషయాన్ని ప్రకటించబోతున్నానని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారట దీంతో బుచ్చయ్య చౌదరి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారని తెలుస్తోంది.
అదేవిధంగా జనసేన కార్యకర్త అయినటువంటి కందుల దుర్గేష్ కి సైతం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారని తెలుస్తుంది. మరో సీటు సర్దుబాటు చేసుకోవాలని కోరగా ఆయన అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇలా తొలి జాబితాలో పేర్లు లేనటువంటి వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్లు చేయడం అదేవిధంగా తన నివాసానికి పిలిపించి మాట్లాడి తరువాత జాబితాలో చోటు దక్కుతుందని భరోసా కల్పించినట్లు తెలుస్తోంది.