ఏపీలో రూ. 19 వేల కోట్లతో పరిశ్రమల ఏర్పాటు.. రాష్ట్రంలోని నిరుద్యోగుల కష్టాలు తీరినట్టేనా!

ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామిక వికాసానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పెట్టుబడిదారులకు అనేక అవకాశాలు కల్పిస్తోంది. పెట్టుబడుదారులు కోరినమేరకు భూములు ఇవ్వడంతో పాటు పలు రాయితీలు, అలాగే మౌలిక సౌకర్యాలు కల్పిస్తోంది. అందుకే దేశంలోనే పరిశ్రమల స్థాపనకు, వ్యాపార అభివృద్ధికి ఏపీ ఒక ముఖ్యమైన ఎంపికగా మారింది. విశాఖ పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు సైతం పాల్గొనగా రూ. 13 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి.

కడప స్టీల్ ప్లాంట్, విశాఖలో టైర్ల పరిశ్రమలు, సాఫ్ట్ వేర్, ఫార్మా రంగాల్లో భారీగా పరిశ్రమలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో రూ. 19 వేల కోట్ల పెట్టుబడులతో పలు పరిశ్రమల స్థాపనకు ఆమోదం తెలిపారు. కాగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో రిలయన్స్ పవర్ ఆధ్వర్యంలో రూ. 6174 కోట్ల పెట్టుబడితో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రాబోతోంది. అయితే ఇందుకోసం ఆ సంస్థ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపగా దాన్ని సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదించింది.

దీనివల్ల 600 మందికి ప్రత్యక్షంగా మరో రెండు వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకనున్నాయి. దీంతో పాటుగా ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగనున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం దగ్గరున్న పారిశ్రామికవాడలో స్మైల్ కంపెనీ రూ. 166 కోట్లతో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చింది. దీనివల్ల దాదాపు 5000 వేలమందికి ఉపాధి దొరుకుతుంది. ఇదే సెజ్ లో ఉన్న ఏటీసీ టైర్స్ సంస్థ రూ. 679 కోట్లతో సంస్థను విస్తరించనుండగా దీనిలో కొత్తగా 300 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఏలూరులోని కొమ్మూరు వద్ద రూ. 114 కోట్లతో ఏర్పాటు కానున్న వెంకటేశ్వర బయోటెక్ సంస్థ 310 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది..

తిరుపతిలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ సంస్థ రూ. 933 కోట్లతో సంస్థను విస్తరిస్తుండగా దీనివల్ల 2100 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. రాజమండ్రి సమీపంలోని కడియం వద్ద ఉన్న ఆంధ్రపేపర్ మిల్లు విస్తరణకు ఆ సంస్థ ముందుకు వచ్చింది దీనికోసం రూ. 4,000 కోట్లు పెట్టుబడి పెడుతుండగా దీనివల్ల రూ. 3000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే విజయనగరం లోని ఎస్. కోట వద్ద రూ. 531 కోట్లతో ఏర్పాటు చేస్తున్న JSW ఇండస్ట్రియల్ పార్కులో ప్రత్యక్షంగా 35,750 మందికి, పరోక్షంగా 9,375 మందికి ఉపాధి దొరకనుంది. విశాఖ జిల్లా పద్మనాభం వద్ద రూ. 50 కోట్లతో ఓరిల్ ఫుడ్స్ సంస్థ ఏర్పాటు కానుండగా దీనిలో 550 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలా ఏపీలో దాదాపుగా రూ. 19 వేల కోట్లతో పరిశ్రమల ఏర్పాటు చేయబోతుండగా అందులో దాదాపు 50 వేలకు మందికి పైగా ఉపాధి దొరకనుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -