Virat Kohli-Anushka: పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ.. అనూష్క శర్మలను దేశంలో మొస్ట్ లవ్ కపుల్ అంటారు. అందుకే ఈ జంటపై ఎక్కువగా చర్చాలు జరుపుతుంటారు. సోషల్ మీడియాల్లో ఎక్కువగా కనిపించే ఈ జంట తమ తమ గురించి ఫాలోవర్స్ నుంచి వచ్చిన ప్రశ్నలకు స్పందిస్తుంటారు. అందుకే ఈ జంటను చాలా మంది ఇష్టపడుతారు. అయితే అనుష్కశర్మ– విరాట్ దంపతులు ఇటీవల మహారాష్ట్రలోని అలీబాగ్లో ఖరీదైన ఫామ్హౌస్ను కొనుగోలు చేసినట్లు వార్తాలు వస్తున్నాయి. 8 ఎకరాల్లో ఉన్న ఈ ఫామ్హౌస్ను ఏకంగా రూ.19.24 కోట్లు పెట్టి వ్యయం చేశారట.
అయితే.. భారత జట్టులో కీలక ఆటగాడైన కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన అనుష్క శర్మ సైతం సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ సెలబ్రిటీ జంట సంపాదన కూడా అదే రేంజ్లో ఉంది. కోహ్లి, అనుష్క ఆర్నెళ్ల క్రితమే జిరాద్ను సందర్శించి ఇందుకోసం డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యారట. విరాట్ సోదరుడు వికాస్ కోహ్లి ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షించినట్లు సమాచారం. ఈ లావాదేవీలకు సంబంధించి కోహ్లి దంపతులు 1.15 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది.