AP Election Meetings: ఎన్నికల హడావిడి మొదలవడంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అలాగే నాయకులూ కూడా ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది అభ్యర్థులు టికెట్లను కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇలా టికెట్లు వచ్చిన వారందరూ కూడా ప్రజలలోకి వెళ్తూ పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఈ విధంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి అంటే భారీ స్థాయిలోనే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి.
ఇకపోతే తమ పార్టీకి ఓట్లు పడాలన్న పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్లాలన్న పెద్ద ఎత్తున బహిరంగ సభలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సిద్ధం సభలను నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు కూడా వివిధ సభలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ విధంగా బహిరంగ సభలను ఏర్పాటు చేయాలి అంటే భారీ స్థాయిలోనే ఖర్చవుతుంది.
మరి ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా లేకుంటే ఎవరు భరిస్తారనే విషయానికి వస్తే ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించదు ఎవరైతే ఎన్నికలలో పోటీ చేస్తున్నారో వారి స్వయంగా ఈ ఖర్చడం భరించాల్సి ఉంటుంది అంతేకాకుండా టికెట్ ఆశించేవారు ఇలా పార్టీ కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నికల పుణ్యమా అంటూ సభలకు తరలించే వారి కోసం ఫుడ్ పెట్టడం వారికి లిక్కర్ కొనివ్వడం అలాగే ఖర్చులకు డబ్బులు ఇవ్వడం వంటి వాటితో భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికలలో డబ్బులు ఖర్చు చేయడం ఏమో కానీ లిక్కర్ డీజిల్ వంటి సేల్స్ భారీగా పెరిగిపోయాయని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.