NTR Fans: కంచరపాలెం దర్శకునికి తారక్ అభిమానులు చుక్కలు చూపిస్తున్నారా?

NTR Fans: 2018 లో విడుదలైన కేరాఫ్ కంచరపాలెం సినిమా ఎటువంటి సక్సెస్ అందుకుందో చూసాం. ఈ సినిమా సినీ ప్రముఖులను కూడా బాగా ఆకట్టుకుంది. విమర్శకులు సైతం ఈ సినిమాను ప్రశంసించారు. ఇక ఈ సినిమాకు వెంకటేష్ మహా దర్శకత్వం వహించాడు. నిజానికి తన కెరీర్ ను ఆయన ఈ సినిమాతోనే ప్రారంభించాడు. ఇక తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నాడు.

 

ఆ తర్వాత సత్యదేవ నటించిన ఉమా పరమేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించగా ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. అయితే దర్శకుడిగా తను ఒక లెవెల్ లో ఉన్నాను అని కాస్త గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన చిక్కుల్లో ఇరికాడు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కే జి ఎఫ్ మూవీ పై కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు.

ప్రస్తుతం ఏ సినిమాలను చేయకుండా ఖాళీగా ఉన్న ఈయన కే జి ఎఫ్ లాంటి సినిమా గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లకు మద్దతు పలికారు డైరెక్టర్ నందిని రెడ్డి, ఇంద్ర గంటి, వివేక్ ఆత్రేయ. తో వెంటనే జనాలు వారిపై ట్రోల్ చేయటం మొదలుపెట్టడంతో.. వెంటనే వెంకటేష్ మహా ఆ కామెంట్ల గురించి స్పందించాడు.

 

తను మాట్లాడిన నీచ్ కమ్ ఇన్ కుత్తే భాష సరికాదని.. అందుకే తన తప్పు ఒప్పుకున్నాను అని.. కానీ తన అభిప్రాయం తప్పు కాదు అంటూ.. దానికి అంటిపెట్టుకొని ఉంటాను అని అన్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈయనపై బాగా మండిపడుతున్నారు. ఏకంగా తమ ట్రోలింగ్స్ తో చుక్కలు చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ అభిమానులు.. డైరెక్టర్ వెంకటేష్ మహా పై.. మా ఎన్టీఆర్ ఎంచుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను మీరు కామెంట్ చేస్తారా అంటూ బాగా ఫైర్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -