Madhya Pradesh: రెండో భార్యతో గొడవ.. కోపంతో కసాయి తండ్రి ఏం చేశారంటే?

Madhya Pradesh: తాజాగా మధ్యప్రదేశ్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక దుర్మార్గమైన తండ్రి రెండో భార్యతో గొడవపడి కొడుకును గొంతు కోసి హత్య చేశాడు. అసలేం జరిగిందంటే.. ఇండోర్ జిల్లాలోని తేవాజీ నగర్ ఏరియాలో శశిపాల్ ముండే అనే 26 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నాడు. అతని భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది. అతనికి ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మొదటి భార్య చనిపోవడంతో శశి పాల్ ఆ తర్వాత రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మొదటి భార్య కొడుకుని చూసుకోవడంలో రెండో భార్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

ఆ పిల్లాడిని తాను చూసుకోలేదని తేల్చి చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది రెండవ భార్య. అంతే కాకుండా ఆ పిల్లాడు ఇంట్లో ఉన్నంత వరకు తాను కాపురానికి రాను అని గట్టిగా తేల్చి చెప్పింది. దాంతో రెండో భార్య చేష్టలకు విసిగిపోయిన శశిపాల్ ఏం చేయాలో తెలియక తన భార్య రావాలంటే కొడుకు ఉండకూడదు అనే కొడుకును అడ్డు తొలగించుకోవాలని భావించాడు. మూడవ తరగతి చదువుతున్న ప్రతీక్ మామూలుగా తన తాతయ్యతో కలిసి పడుకునే వాడు. కానీ తాజాగా తండ్రి శశిపాల్ తాను ఉండే కూలర్ ఉన్న గదిలో పడుకోమని చెప్పాడు. ఇక తండ్రి మాట కాదనలేక సంతోషంగా ఉత్సాహంగా తండ్రి గదికి వెళ్లి పడుకున్నాడు.

 

అదే విషయాన్ని తాతకు చెప్పి వెళ్లి పడుకున్నాడు. కొడుకు నిద్రపోతున్న సమయంలో శశిపాల్ కావాలనే టీవీ సౌండ్ పెంచి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఇక ఇరుగుపొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొడుకును హత్య చేసి పరారైన శశిపాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -