Ayyanna: జగన్ గురించి అయ్యన్న సంచలన వ్యాఖ్యలు.. జరగబోయేది ఇదేనా?

Ayyanna: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీ నేతలు ప్రజలలోకి వచ్చి పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం భీమిలిలో ఎంతో విజయవంతమైన సంగతి తెలిసిందే.

 

ఇక ఈ సభ అనంతరం మాజీ మంత్రి టిడిపి నేత అయ్యన్నపాత్రుడు జగన్మోహన్ రెడ్డి పట్ల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి పక్కా 420 అని అయ్యన్నపాత్రుడు కామెంట్లు చేశారు. మరో మూడు నెలలలో ఈయన జైలు పాలు కావడం ఖాయమని ఎక్కడ ఉన్నా తనకు జైలు పాలవ్వడం తప్పదని తాను తిన్న డబ్బు మొత్తం కక్కిస్తామని అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం లా వ్యవహరించడం లేదని పగటవేష గాడిలా మాట్లాడుతున్నారని ఈయన ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పక్కన పెట్టి రాష్ట్రం మొత్తం దోచుకోవడం మొదలుపెట్టారని తెలిపారు. ఈయన 95% హామీలను నెరవేర్చారని చెబుతున్నారు ఎక్కడ నెరవేర్చారు అంటూ ప్రశ్నించారు. మద్యపానం సిపిఎస్ రద్దు 45 సంవత్సరాల పెన్షన్ ఇల్లు విషయంలో తన హామీలను నిలబెట్టుకోలేదని తెలిపారు.

 

గాదిరాజు ప్యాలెస్ మీద కూడా కన్నేశారని.. భారతికి నచ్చితే ఆ ప్యాలెజ్‌ని దొబ్బేస్తారా? అని అయ్యన్న పాత్రుడు నిలదీశారు. ప్రజల పాస్ బుక్ పైన చివరికి సర్వే రాళ్లపై కూడా జగన్ బొమ్మ వేసుకోవడం ఏంటి అంటూ ఈయన ప్రశ్నించారు అంతేకాకుండా ప్రతిరోజు రాత్రి తనను చంపేస్తాము అంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని అందుకే తాను తన లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్నాను అంటూ ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు జగన్ పరిపాలన గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -