Ambati: బాబు గారు బస్సు ఎక్కాడు.. పప్పు పుత్రుడు రోడ్ ఎక్కాడు.. దత్తపుత్రుడు లారీ ఎక్కాడు.. అంబటి షాకింగ్ కామెంట్స్!

Ambati: వారాహి యాత్ర పేరుతో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తుండగా నారా లోకేష్ కొన్ని నెలలుగా యువగళం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మరోవైపు కోనసీమ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. వీరిని ఉద్దేశిస్తూ అంబటి రాంబాబు సెటైర్లు వేయటం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే మంత్రి అంబటి రాంబాబు..

ఒకే ట్వీట్ తో అటు చంద్రబాబు నాయుడుని ఇటు ఆయన పుత్రుడు పప్పు లోకేష్ ని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ని తీసిపడేసినట్లుగా మాట్లాడారు. గత నెల రోజులుగా చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ని కలుపుకొని ఇద్దరు పుత్రులతో కలిపి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. లోకేష్ పాదయాత్రకి పబ్లిసిటీ ఇబ్బంది లేకుండా పగలంతా స్టార్ హోటల్స్ లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ రాత్రులు మాత్రం బస్సు ఎక్కి పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. బాబు గారు బస్సు ఎక్కారు..

 

పప్పు పుత్రుడు రోడ్డు ఎక్కాడు, దత్తపుత్రుడు లారీ ఎక్కాడు కానీ చంద్రబాబు గద్దెనెక్కడ సాధ్యం కాదు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి దానికి చంద్రబాబు నాయుడు ని పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని టాగ్ చేశారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ పర్యటించిన ప్రాంతాలలోనే చంద్రబాబు నాయుడు కూడా పర్యటిస్తూ కార్యకర్తలని రెచ్చగొడుతూ రాజకీయ దుమారం సృష్టిస్తున్నారు.

 

అందుకే ఆ ముగ్గురికి అంబటి రాంబాబు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అయితే బ్రో సినిమా గురించి జరిగిన రచ్చ సంగతి మనందరికీ తెలిసిందే. ఆ ఘటనలో పవన్ కి సపోర్ట్ గా నిలిచారు చంద్రబాబు నాయుడు, లోకేష్. దానికి రీకౌంటుగా పవన్ లారీ యాత్ర చేసినా, బాబు బస్సు యాత్ర చేసినా, లోకేష్ పాదాలపై నడిచే పాదయాత్ర చేసినా ఎవరికీ ఎటువంటి ప్రయోజనం లేదంటూ అంబటి రాంబాబు పెట్టిన కామెంట్లు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -