Chandrababu: మామూలుగా టీడీపీ నేతలు చంద్రబాబు క్రమశిక్షణకు మారుపేరు అని చెబుతూ ఉంటారు. అలాంటిది తాజాగా చంద్రబాబు ఏకంగా సంచలన హామీ ఇచ్చారు. ప్రస్తుతం సీమ డిక్లరేషన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న నేపథ్యంలో బాబు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండగా మద్యం బాబుల నుంచి చంద్రబాబుకు ఊహించని ప్రశ్న వచ్చింది. టీడీపీ అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తారా? అంటూ కొందరు మందు ప్రియులు ప్రశ్నించారు.
అయితే సాధారణంగా అయితే చంద్రబాబు బహిరంగ సభల్లో మద్యం గురించి ఎక్కడా ఎప్పుడు కూడా ప్రకటనలు చేయలేదు. కనీసం మాట్లాడలేదు. అటువంటి బాబు తాజాగా మద్యంపై కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని తెలిపారు. అంతేకాకుండా నాణ్యమైన మద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు బాబు. మద్యం ప్రియులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని తాము అధికారంలోకి రాగానే మద్యంపై ధరలు నియంత్రించడంతోపాటు ఒక క్రమబద్ధీకరణ విధానాన్ని కూడా ప్రకటిస్తామని తేల్చి చెప్పారు.
అయితే చంద్రబాబు ఇలా మద్యంపై బహిరంగ హామీలు గుప్పించడం పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. సంప్రదాయ ఓటర్లు కొంత పెదవి విరుస్తున్నారు. అదేంటి బాబూ మీరు కూడానా అంటూ కొందరు వ్యాఖ్యానిస్తే ప్రస్తుతం మారిన రాజకీయాలకు అనుగుణంగా చంద్రబాబు కూడా మారుతున్నారని మరికొందరు సమర్థిస్తున్నారు. కానీ చంద్రబాబు బహిరంగంగానే మద్యం ప్రియులకు చక్కటి శుభవార్తను తెలిపారు..