KTR: మంత్రి కేటీఆర్ పై పోటీ చేయబోతున్న బండి సంజయ్.. ఇద్దరిలో విజేత ఇతనేనంటూ?

KTR: త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రెండు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే బిజెపి కూడా అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని సమాచారం.

ఇక బిజెపి మాత్రం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంలో సరికొత్త స్ట్రాటజీ ఉపయోగిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత మంత్రులను టార్గెట్ చేస్తూ క్యాండిడేట్లను రంగంలోకి దింపబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా బిజెపి పార్టీ నుంచి ఈటెల రాజేంద్రనాథ్ ను బరిలోకి దింపబోతున్నారని తెలుస్తోంది. ఈయన ఈ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కెసిఆర్ పాపులారిటీని తట్టుకొని లోకల్ సెంటిమెంట్ తో హుజురాబాద్ లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

ఈ క్రమంలోనే చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా ఈటెల రాజేంద్రనాథ్ బరిలోకి దిగబోతున్నారు. అదేవిధంగా సిరిసిల్లలో కేటీఆర్ పై బండి సంజయ్ రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. ఈ పోటీలో తానే విజయం సాధిస్తానని బండి సంజయ్ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మంత్రి హరీష్ రావు పై బూర నరసయ్య గౌడను రంగంలోకి దించబోతున్నారని తెలుస్తుంది. ఈ విధంగా తెలంగాణ మంత్రులను టార్గెట్ చేస్తూ వారిని ఎలాగైనా గద్ద దింపడం కోసం బలమైనటువంటి క్యాండిడేట్లని బిజెపి కూడా ఆ నియోజకవర్గాలలో ఎన్నికల బరిలో దింపబోతున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -