Bandi Sanjay: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం జరిగిందంటే?

Bandi Sanjay: తెలంగాణలో వచ్చే ఏడాది రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది సీఎం కేసీఆర్ మరోసారి సీఎం అవ్వాలి అని అనుకుంటుండగా తెలంగాణలో చాలా వరకు ప్రజలు వద్దు బాబోయ్ అని అంటున్నారు. కేవలం ప్రజలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా కేసీఆర్ మళ్లీ సీఎం అయితే అంతే సంగతులు అని అంటున్నారు. తాజాగా బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కూడా కేసీఆర్ మరోసారి సీఎం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఆఆగం చేస్తాడు అని తెలిపారు. ఇక్కడి రైతుల గోస కనిపించడం లేదు కానీ పంజాబ్ రైతులకు మాత్రం కోట్లిచ్చాడు అంటూ విమర్శించారు.

తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలివ్వడు కానీ పక్క రాష్ట్రం నుంచి పార్టీలో జాయిన్ చేసుకుని మరి లక్షల జీతం ఇస్తున్నాడు అని మండిపడ్డారు బండి సంజయ్. కేసీఆర్ పైసలు పంజాబ్ కు ఉద్యోగాలు మహారాష్ట్రకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సర్కార్ తాగుడికి ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తుందని అందుకే కేసీఆర్ మద్యం రేట్లు తగ్గించారంటూ సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ను ఇలానే వదిలేస్తే స్విగ్గీ, జొమాటో వాళ్లతో ఇంటింటికి మద్యం సరఫరా చేయిస్తాడని సంజయ్ తెలిపారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసీఆరే డబ్బులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రైతుల గోడు ప్రభుత్వానికి కనిపించడం, వినిపించడం లేదు అంటూ మండి పడ్డారు.

 

రిటైర్ అయిన సోమేశ్ ను సలహాదారుడిగా పెట్టుకుంటాడు. అసలు సంబంధం లేని మహారాష్ట్ర వ్యక్తికి కండువా కప్పి నెలకు లక్షన్నర జీతం ఇస్తాడని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన కేసీఆర్, టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ పై ఇప్పటి వరకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి పైసలు వస్తాయి,కానీ పథకాల అమలుకు రావడం లేదన్నారు. డబుల్ బెడ్రూంలు ఇవ్వడు, రైతులను ఆదుకోడు, ఉద్యోగాలివ్వడు, క్రీడాకారులను ఆదుకోడని ఇలాంటి సీఎం మనకెందుకు అంటూ ప్రశ్నించారు బండి సంజయ్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -