Gudiwada Amarnath: మీ నాన్న కానిస్టేబుల్ కాకముందే మా తాత ఎమ్మెల్యే.. పవన్ పై ఫైర్ అయిన గుడివాడ అమర్నాథ్!

Gudiwada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాజాగా గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ పై మండి పడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అమర్నాథ్ మాట్లాడుతూ.. మీ నాన్న కానిస్టేబుల్ కాకముందే మా తాత శాసనసభ్యులు. మా తాతగారు సర్పంచ్ నుంచి శాసనసభ సభ్యుడుగా, మా నాన్నగారు శాసనసభ్యుడు నుంచి మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా, నేను శాసనసభ్యుడిగా మంత్రిగా దాదాపు 60 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయాలు నడుపుతున్న ఫ్యామిలీ మాది.

అటువంటి ఫ్యామిలీ వచ్చిన వ్యక్తులను మేము, కానీ నీలాగా మీ అన్నయ్యగారు చిరంజీవి మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చావు. ఆయన పేరు చెప్పుకొని సినిమా ఇండస్ట్రీకి వెళ్లి క్రేజ్సంపాదించుకున్నావు. చిరంజీవి గారి లేకపోతే నీకు సరైన గుర్తింపు దక్కేది కూడా కాదు. ఆయన పేరు చెప్పుకొని గుర్తింపు సంపాదించుకున్నావు అంటూ మండిపడ్డారు. కానీ నేను మా నాన్న మంత్రిగానో, మా నాన్న పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తిని కాదు.

 

నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోతే నేను అనుకున్న విధంగా 18 సంవత్సరాలు ప్రజా సేవ కోసం మా నాన్న అనుకున్న ఆశయాల కోసం 18 ఏళ్ళు కష్టపడ్డాను అని తెలిపారు. ఆరోజు అంత కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల మాట్లాడుతున్నాను. ఏది పడితే అది ఎవడి మీద పడితే వాడి మీద అది ఇది మాట్లాడేస్తాను అంటే నా వెంట్రుక కూడా పీక్కోలేవు అన్నట్టుగా సైగ చేశారు గుడివాడ అమర్నాథ్. ఇందాక నేను ఒక కార్యక్రమం గురించి కూడా వస్తున్నప్పుడు గొర్లు వస్తున్నాయి పిల్లలు వస్తున్నారు అయినా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బండ్లు నడపడం ఒక బండి పై ముగ్గురు నలుగురు కూర్చోవడం , గిడ్డిగా అరుచుకుంటూ కేకలు వేయడం స్టైల్ గా కటింగ్ కొట్టించుకోవడం నాలుగైదు రకాల హెయిర్ కలర్స్ కొట్టించుకోవడం ఒకటేమో బండి తోలేటప్పుడు కింద పడిపోతాడేమో అనుకున్నా అలాగే పడిపోయాడు. ఇక పక్కనే అంబులెన్స్ ఉండడం వల్ల వాడు ప్రాణాలతో బయటపడ్డాడు అంటూ పవన్ కళ్యాణ్ పై పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే నేతలపై మండిపడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -