Allu Family: అల్లు అరవింద్, అల్లు అర్జున్ శిరీష్ ను పక్కకు పెట్టారా.. అల్లు ఫ్యామిలీ వార్ ఏంటి?

Allu Family: గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీలో.. అల్లు ఫ్యామిలీలో కొన్ని రకాల విభేదాలు జరుగుతున్నాయని వార్తలు షికార్లు కొడుతున్నాయి. మరి ఈ పుకార్ల వెనక నిజమెంతుందో తెలియదు కానీ వార్తలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. కానీ ఈ పుకార్ల గురించి అల్లు బ్రదర్స్ ఏనాడూ స్పందించలేదు.

ఇదిలా ఉంటే అల్లు ఫ్యామిలీ గురించి ఒక కొత్త పుకారు వెలుగులోకి వచ్చింది. అల్లు అరవింద్ ఫ్యామిలీలో కొన్ని సీరియస్ క్లాషెస్ నడుస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు జరుగుతున్నాయి. అదేమిటంటే అల్లు అరవింద్, అల్లు అర్జున్ ల మాటను కొట్టి పారేసి అల్లు శిరీష్ తన సొంత దారిలో నడుస్తున్నాడట.

ఇది అల్లు అరవింద్ కి నచ్చడం లేదని పుకార్లు వస్తున్నాయి. ఇక అల్లు అరవింద్ ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య ఇలా గొడవలు జరగడం వల్లే వీళ్ళు ఒకే చోట కనబడడం లేదు అని అంటున్నారు. నిజానికి గత కొంతకాలం నుంచి జరిగిన మెగా ఈవెంట్లలో ఈ అల్లు బ్రదర్స్ కలిసి ఏ ఈవెంట్లో కనబడలేదు.

ఇటువంటి మార్పులు సోషల్ మీడియాలో జరిగే పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లుగా అవుతుంది. ఇక అల్లు అరవింద్ ఇటీవల ఒక మీడియాతో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీలో.. అల్లు ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవని తెలిపాడు. మరి ఇందులో ఒక కొత్త పుకారు ఏంటంటే.. అల్లు శిరీష్ ని విభేదాల కారణంగానే అల్లు అరవింద్, అల్లు అర్జున్ లు పక్కన పెట్టేసారని వార్తలు జరుగుతున్నాయి.

మరి వీటి వెనుక నిజం ఎంతో తెలియాలి అంటే? అల్లు ఫ్యామిలీ వీటి గురించి స్పందించే వరకు వేచి చూడాల్సి ఉంది. అల్లు శిరీష్ గత కొంతకాలంగా ఇండస్ట్రీలో పూర్తిగా కనబడడం మానేశాడు. అంతేకాకుండా అల్లు శిరీష్ చేసే ఒక కొత్త ప్రాజెక్టు కూడా ఇంతవరకు విడుదల కాలేదు. ఇక దీని గురించి అల్లు శిరీష్ ఏమని స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -