YS Jagan: పులివెందల అంటేనే వైయస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటిదని చెప్పాలి కడపలో వైయస్ కుటుంబానికి భారీ మెజారిటీ లభిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు వార్ వన్ సైడ్ అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం పులివెందుల రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని తెలుస్తది. పులివెందుల నియోజకవర్గం నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తూ ఉండగా కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
అయితే ఈసారి మాత్రం పులివెందులతో పాటు కడపలో కూడా వీరిద్దరిని ఓడించే దిశగా వైయస్ వారసురాలు రంగంలోకి దిగుతున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై పోటీకి వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. అలాగే కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి పోటీగా వైయస్ షర్మిల ఎంపిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ అవినాష్ రెడ్డి నేరస్తుడని షర్మిల పదేపదే ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్క సభలోను గుర్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే వారిని ఎలాగైనా గద్ద దింపాలి అన్న ఆలోచనలోనే వీరిద్దరూ తన అన్నయ్యలకు పోటీగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. ఇక వైయస్ వివేకానంద రెడ్డి కడప రాజకీయాలను మొత్తం తన గుప్పెట్లోనే పెట్టుకునేవారు.
ఇలా అప్పట్లో వివేకానంద రెడ్డి రాజశేఖర్ రెడ్డి కి అనుకూలంగా వ్యవహరించారు అయితే ఆయన హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందని తెలియడంతో ఈసారి ఎన్నికలు తారుమారు అవుతాయని షర్మిల వైయస్ రాజశేఖర్ రెడ్డి అనే ఓటు బ్యాంకును కనుక చీలిస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఓటమిని ఎదుర్కోవాల్సి ఉంటుందని అయితే ఇలా ఓట్లు చీల్చడం కష్టతరమైన పని అని కూడా చెప్పాలి చూడాలి మరి కడప రాజకీయాలు ఎలా మారబోతున్నాయో తెలియాలి అంటే వేచి చూడాలి.