Btech Ravi: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్ నవరత్నాల పేరిట ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అమ్మ ఒడి పథకాన్ని కూడా ప్రారంభించారు.
ఇక ఈ అమ్మఒడి పథకం ప్రారంభించి దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికీ కొంతమంది ఖాతాలో డబ్బులు జమ కాలేదు ఈ విషయం గురించి బీటెక్ అవి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ జిల్లా వేముల చక్రాయపేట వేముల మండలం తెదేపా నేతల శిక్షణ కార్యక్రమంలో భాగంగా బీటెక్ రవి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై చెక్ బౌన్స్ కేసు పెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమ్మ ఒడి పథకం విడుదలైన చాలా రోజులవుతున్నప్పటికీ ఇంకా కొంతమంది ఖాతాలలో డబ్బులు జమ కాలేదు ఈ విషయంపై తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై చెక్ బౌన్స్ కేసు పెడతామని తెలిపారు. అలాగే రైతులకు పంట నష్ట పరిహారపు డబ్బులు కూడా ఇంకా జమ కాలేదని ఈయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పలు పథకాల పేరిట బటన్లు నొక్కుతూ ఉన్నప్పటికీ అవి మాత్రం ప్రజల ఖాతాలలో పడటం లేదని విమర్శలు కురిపించారు. ప్రస్తుతం బీటెక్ రవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.