Jagan-Btech Ravi: జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన టిడిపి నాయకుడు బీటెక్ రవి…!

Jagan-Btech Ravi: తాజాగా పులివెందుల టిడిపి నాయకుడు బిటెక్ రవి జగన్ మోహన్ రెడ్డి బావ అయిన బ్రదర్ అనిల్ కుమార్ ని కడప ఎయిర్ పోర్ట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది రాజకీయంగా పెద్ద వైరల్ అయ్యాయి.

 

కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి బ్రదర్ అనిల్ కుమార్ ఇండిగో విమానంలో బయలుదేరారు. అదే సమయంలో కడప విమానాశ్రయంలో ఉన్న వీఐపీ లాంజ్‌లో బ్రదర్ అనిల్‌ను బీటెక్ రవి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీటెక్ రవి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో వీరిద్దరి కలయిక సంచలనంగా మారింది.

అయితే బ్రదర్ అనిల్ కుమార్ ని కలవడం పైన బీటెక్ రవి స్పందించారు. తాను అనిల్ కుమార్ ని యాదృచ్ఛికంగా మాత్రమే కలిశానని చెప్పారు.అయినా తాను బ్రదర్, అనిల్ కుమార్ అందరం జగన్ మోహన్ రెడ్డి బాధితులమే అని అందరం కలిస్తే తప్పేంటి అని అన్నారు. ఇప్పుడు వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైసిపి నాయకులు ఆమెపై కూడా విమర్శలు చేస్తున్నారని రేపు విజయమ్మ కూడా తనకి అడ్డంగా వస్తుందనుకుంటే ఆమె పైన కూడా విమర్శలు చేయడానికి వెనకాడరని అన్నారు. వేరే పార్టీలో చేరిందని సొంత నాయకులతో సొంత చెల్లెలుని తిట్టించే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి అని, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. షర్మిలాని జగన్మోహన్ రెడ్డి మోసం చేయడం వల్లే ఆమె తన సొంతదారి వెతుక్కున్నారని చెప్పుకొచ్చారు.

 

పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పైన వైసిపి పైన తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, టిడిపిలో చేరుతున్న వారి పైన కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో పులివెందులలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ఈసారి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం అని అన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -