Chandrababu: ఏపీ ప్రజలకు మంచి జరగాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందా?

Chandrababu: ప్రస్తుతం రానున్న ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకుల మధ్య పోటీ బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈసారి ముఖ్యమంత్రి జగన్ ను ఎలాగైనా గద్దె దించాలి అని తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా కంకణం కట్టుకుంది. ఇక ఎలాగైనా చంద్రబాబును ఈసారి ముఖ్యమంత్రి చేయాలి అని తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

 

ఇప్పటికే నారా లోకేష్ తండ్రిని గద్దె ఎక్కించడానికి బాగా ప్రయత్నిస్తున్నాడు. బాగా కష్టపడి పాదయాత్రలు చేస్తున్నాడు. ఎక్కడ కూడా అలసిపోకుండా ప్రతి ఒక్కరికి తమ అధికారంలోకి వస్తే పాలన ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు. ఇక చాలా వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చంద్రబాబు అధికారంలోకి వస్తే తమకు అంత మంచే జరుగుతుంది అని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా అమరావతిని మరింత అందంగా రూపుదిద్దుతాడని.. చాలావరకు అభివృద్ధి చెందిస్తారని అనుకుంటున్నారు. ప్రస్తుతం జగన్ అప్పులు చేసి జనాలకు పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కొందరు సంతృప్తి చెందట్లేదని తెలుస్తుంది. అధికారంలోకి చంద్రబాబు వస్తేనే మళ్లీ మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

 

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ను బాగా రూపుదిద్దాడు అని చాలా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇటువంటి మహానగరంను ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో చూడాలి అని ప్రజలు అనుకుంటున్నట్లు.. అయితే అది జగన్ ప్రభుత్వం వల్ల కాదు అని.. కేవలం చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అవుతుంది అని గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీలో అభివృద్ధి జరగాలంటే ప్రస్తుతం చంద్రబాబు మాత్రమే ఆప్షన్ అని అంటున్నట్లు తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -