Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ అంటే హింస హత్య రాజకీయాలు మాత్రమే.
తెలుగుదేశానికి రాయలసీమ అంటే నీళ్లు ప్రాజెక్టులు రైతులను రాజును చేయడమే మా పార్టీ సంకల్పమని ఈయన తెలిపారు. జగన్ పరిపాలన చూసిన తర్వాత పులివెందులలో కూడా ఆయనకు వ్యతిరేకత ఏర్పడిందని ట్రెండ్ మారిందని వైకాపా బెండు తీయడం ఖాయమంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి గాడిన పడిందని తెలిపారు. ఈయన ఒక్క కంపెనీని అయినా తీసుకువచ్చారా అంటూ ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి వచ్చిన కంపెనీలను కూడా పక్క రాష్ట్రాలకు తరిమి వేశారని చంద్రబాబు తెలిపారు. కడప స్టీల్ ప్లాట్ కనుక ప్రారంభించి ఉంటే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేవి ఈయన కేవలం శంకుస్థాపనలు మాత్రమే చేస్తారు కానీ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయరని చంద్రబాబు తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టుల విలువ నీటి విలువ ఏమాత్రం తెలియదు రాయలసీమకు కనుక నీళ్లు తెస్తే కోనసీమలా తయారవుతుందని ఈయన తెలిపారు.
సీమ కోసం ఈయన ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవని తెలిపారు. తమ ప్రభుత్వంలో 75% వరకు ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని తెలిపారు. క్విట్ జగన్ సేవ్ రాయలసీమ నినాదం కావాలి అంటూ ప్రొద్దుటూరు సభలో చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.