Chandrababu: జగన్ కు భారీ షాకిచ్చిన చంద్రబాబు నాయుడు.. ఏమైందంటే?

Chandrababu: తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు సత్తెనపల్లి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్డు షో లో భాగంగా ప్రస్తుత అధికార ప్రభుత్వం పై చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.అదేవిధంగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు జగన్ కి సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉంటే సమాధానం చెప్పాలి అంటూ ఛాలెంజ్ చేశారు.

ప్రస్తుతం వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనగా మారిన విషయం మనకు తెలిసిందే. కేవలం ఈయన ఆస్తుల కోసమే తనపై దాడి చేశారంటూ కొన్ని టీవీ చానల్స్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. అయితే తాజాగా వైఎస్ షర్మిల వివేకానంద రెడ్డి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలను పూర్తిగా ఖండించారు.

 

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన వైఎస్ షర్మిల చిన్నాన్న గత కొన్ని సంవత్సరాల క్రితమే తన ఆస్తులు అన్నింటిని సునీత పేరు మీద రాశారని తెలిపారు.ఇలా ఆస్తులన్నీ తన పేరు మీదట ఉంటే ఇక సున్నితను చిన్నాన్న చంపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.బాబాయ్ వివేకానంద రెడ్డి చాలా మంచి వ్యక్తిత్వం కలవారిని అతనిపై కొన్ని టీవీ ఛానల్ నిందలు వేస్తున్నాయని వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

 

ఇలా షర్మిల తన అన్నయ్యను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇదే అదునుగా భావించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సత్తెనపల్లి రోడ్ షోలో స్వయంగా తన జగన్ రక్తం పంచుకొని పుట్టిన వైఎస్ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే సమాధానం చెప్పాలనీ చాలెంజ్ విసిరారు. మరి చంద్రబాబు వ్యాఖ్యలకు జగన్ ఎలాంటి సమాధానం చెబుతారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -