Chandrababu: ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు జగన్… చంద్రబాబు సవాల్ మామూలుగా లేదుగా!

Chandrababu: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్ధం పేరిట పెద్ద ఎత్తున బహిరంగ సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే దెందులూరు భీమలిలో ఈ సిద్ధం సభలు పూర్తి అయ్యాయి. ఇక తాజాగా రాప్తాడులో కూడా పెద్ద ఎత్తున సిద్ధం సభను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా రాప్తాడులో సిద్ధం సభను నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతూ దమ్ముంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ తెలియజేశారు. ఈ ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెబుతారా లేకపోతే రాప్తాడు సిద్ధం సభలోనే సమాధానాలు చెబుతారా అంటూ చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. రాప్తాడు అడుగుతుంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేసావని ?అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని?

సీమ రైతన్న అడుగుతున్నాడు నాటి డ్రిప్ పథకాలు ఎక్కడ అని? సమాధానాలు చెప్పి రాప్తాడులో సభ పెడతావా లేకపోతే సభలోనే సమాధానాలు చెబుతావా అంటూ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. అయితే సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పై విమర్శలు చేశారే తప్ప చంద్రబాబు విసిరిన సవాళ్లకు సమాధానాలు మాత్రం చెప్పలేక పోయారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -