Chandrababu: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీల నేతలు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు మహిళలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేస్తానని ఈయన వెల్లడించారు. దేశంలోనే గర్వించే విధంగా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. డబ్బులకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్ అమ్మే పరిస్థితికి వచ్చారని ఈయన ప్రభుత్వం పై విమర్శలు చేశారు. చీకటి వ్యాపారాలు చేస్తూ రాష్ట్రాన్ని వైకాపా బ్రష్టు పట్టించిందని ఈయన విమర్శించారు.
దేశంలోనే ఆడబిడ్డల గురించి తొలిసారి మాట్లాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈయన తెలిపారు. ఆడబిడ్డలకు కూడా ఆస్థిలో సమాన వాటాను కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. వచ్చే ఎన్నికలలో మన ప్రభుత్వం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక కుప్పం నియోజకవర్గంలో లక్ష మెజారిటీతో మన ప్రభుత్వం గెలవాలని ఈయన పిలుపునిచ్చారు.
ఇక ఎవరైనా వైకాపాకు ఓటు వేయాలని వస్తే వారికి కర్ర కాల్చి వాత పెట్టండి అంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి మరి ఈయన కలలు కన్నట్టు లక్ష మెజారిటీ రావడం సాధ్యమేనా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈసారి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు కు పోటీగా భరత్ ను జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే.