Charmi: రెండు దశాబ్దాల సినీ కెరియర్ లో భారీగా సంపాదించిన చార్మి!

Charmi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి చార్మి ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే ఈమె నటిగా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా తెరపై కాకుండా తెరువెనక ఈమె ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నట్లు తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ తో కలిసి నటి చార్మి పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఇలా పూరి జగన్నాథ్ తో కలిసి పలు సినిమాలలో నిర్మాణ భాగస్వామ్యం అందుకున్న ఈమె ఈ నిర్మాణ సంస్థ కార్యక్రమాలను చూసుకుంటూ భారీగానే పారితోషికం తీసుకుంటుంది. అదేవిధంగా సినిమా లాభాలలో కూడా వాటాలను తీసుకుంటూ భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విధంగా చార్మి దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఈమె ఎన్నో సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపారు.అప్పట్లో చార్మి ఒక్కో సినిమాలో నటించిన కోసం సుమారు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది.

ఇక ఈమె ఆస్తుల విషయానికి వస్తే హైదరాబాదులోని గచ్చబౌలి ప్రాంతంలో తనకు ఓ ఖరీదైన అపార్ట్మెంట్ ఉందని తెలుస్తోంది చార్మి కుటుంబ సభ్యులందరూ ఇక్కడే నివసిస్తున్నారు. అదేవిధంగా ముంబైలో కోట్ల రూపాయల విలువ చేసే రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేసిందని సమాచారం.ఇవే కాకుండా ఈమె తన గ్యారేజీలో ఎంతో లగ్జరీ ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ విధంగా చార్మి ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతోందని తెలుస్తోంది. 2019 సర్వే ప్రకారం ఈమె నెట్ విలువ అప్పటికే రెండు మిలియన్ డాలర్లు ఉన్నట్లు సమాచారం అయితే ప్రస్తుతం ఈ ఆస్తి విలువ మరింత పెరిగి ఉంటుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -