Charmy Kaur: సోషల్ మీడియాకు దూరమైన ఛార్మి.. చిల్ గాయ్స్ అంటూ?

Charmy Kaur: ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో లైగర్ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 90 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా కేవలం 30 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన ఛార్మీ కౌర్ భారీ మొత్తంలో నష్టపోయారు. అటు ఆర్థికంగా ఈ సినిమా నష్టాలను మిగల్చడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన ట్రోల్స్ కూడా ఛార్మీని మరింత బాధ పెట్టాయి.

లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఛార్మి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి ఛార్మి తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నారు. చిల్ గాయ్స్ కాస్త సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటున్నా అంటూ ఛార్మి సోషల్ మీడియా విషయంలో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. పూరీ కనెక్ట్స్ త్వరలో మరింత దృఢంగా మునుపటి కంటే ఉత్తమంగా తిరిగొస్తుందని ఛార్మి వెల్లడించడం గమనార్హం.

అప్పటివరకు కొంచెం శాంతించండి అబ్బాయిలు అంటూ ఛార్మి కామెంట్లు చేశారు. లైగర్ మూవీకి భారీ ఓటీటీ ఆఫర్ వచ్చినా ఛార్మి, పూరీ జగన్నాథ్ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారనే సంగతి తెలిసిందే. ఆ ఆఫర్ కు లైగర్ మేకర్స్ ఓకే చెప్పి ఉంటే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఓటీటీ సంస్థ నుంచి ఊహించని మొత్తం అందేది. మరోవైపు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.

50 రోజుల తర్వాతే లైగర్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకోగా ఆ ఒప్పందంలో మార్పులు చేసుకుంటే మాత్రం సినిమా అనుకున్న సమయం కంటే ముందుగా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఛార్మి ఎంపిక చేసుకునే ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -