Hyper Adi: చిరంజీవి మంచోడు కాబట్టి ముంచారు.. పవన్ తేలుస్తాడు.. హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు!

Hyper Adi: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా నటించిన భోళా శంకర్ సినిమా ఈనెల 11వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంగా తాజాగా ఆదివారం రోజున ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ సందర్భంగా జబర్దస్త్ కామెడియన్ హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. ఓ మధ్య తరగతి వాడు యుద్దం చేసేందుకు వచ్చాడు. అప్పటి వరకు ఎంతో మంది యుద్దం చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఆయనకు చాన్స్ వచ్చింది, యుద్దం చేశాడు. ఆ యుద్దభూమికి సైన్యాధిపతి అయ్యాడు.

ముప్పై ఏళ్లుగా ఆ యుద్దభూమిని ఏలుతూనే ఉన్నారు. ఆయనే చిరంజీవి చిత్రపరిశ్రమను ఏలుతూనే ఉన్నారు. అన్నయ్య ఇంత మంది సినీ సైనికులను తయారు చేసి ఇంద్రసేన అయితే అక్కడ తమ్ముడేమో జన సైనికుల్ని తయారు చేసి జనసేనా అయ్యారు అని తెలిపారు ఆది. ఎవరి గురించైనా మాట్లాడితే.. వినేవాడికి గూస్ బంప్స్ వస్తుంటాయి.. కానీ ఆ మాట్లాడే వాడికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయంటే అది కచ్చితంగా చిరంజీవి గారి గురించే. హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆయనకు హీరోలే ఫ్యాన్స్ గా ఉంటారు. ఆస్తులు సంపాదించడం కన్నా అభిమానం సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. పాత తరానికి కొత్త తరానికి వారధి. ఇన్ని కోట్ల మంది అభిమానులకు సారథి. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో తెలియదు గానీ ఒక్కరైనా చిరంజీవి ఫ్యాన్ ఉంటాడు.

 

నా దృష్టిలో సచిన్, చిరంజీవి ఒక్కరే క్రికెట్‌లో విమర్శలు వస్తే సచిన్ బ్యాటింగ్‌తో సమాధానం ఇస్తాడు సినిమాల్లో విమర్శలు వస్తే.. చిరంజీవి గారు సినిమాలతోనే సమాధానం ఇస్తారు అంటూ ఒక రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించాడు ఆది. కొందరు తమ్ముడిని పొగిడి అన్నయ్యను తిడుతున్నారు. తన తమ్ముడిని తిట్టి తనను పొగిడే ఆనంద పడేవాడా? ఆయన ఈ మధ్య ఒక సారి రాజకీయాల గురించి ఆయన్ను అడిగాను.. రాజకీయ వార్తలు చూడటం మానేశాను అని అన్నారు. నా తమ్ముడిని ఎవడు పడితే వాడు తిడుతున్నాడు. అందుకే వార్తలు చూడటం లేదు. అని అన్నారు.. ఆయన్ను అవమానించిన వాడ్ని ఆయన వదిలేస్తాడేమో గానీ తమ్ముడు మాత్రం వదలడు అందరికీ తిరిగి ఇస్తాడు అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చాడు హైపర్ ఆది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -