Chiranjeevi :స్వయంకృషితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో తన నటనతో వరుస అవకాశాలను అందుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు నటుడు చిరంజీవి. ఇలా ఈయన ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ మొదట్లో హైదరాబాదులోని ఎన్నో ఆస్తులను కొనుగోలు చేసినట్లు మనకు తెలిసిందే.
ఇలా అప్పట్లో చిరంజీవి లక్షల్లో కొన్న ఆస్తులు ప్రస్తుతం కోట్ల విలువ చేస్తున్నాయి. అయితే తాజాగా ఈయన ఓ ఖరీదైన ఫ్లాట్ ను అమ్మారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా వార్తలలో ఒక దినపత్రిక యజమాని ఒత్తిడి వల్లే మెగాస్టార్ చిరంజీవి తన ఖరీదైన ఫ్లాట్ అమ్ముకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా చిరంజీవి గురించి వస్తున్న ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని చిరంజీవి సన్నిహితులు వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి ఆస్తి అమ్మిన మాట నిజమే కానీ, ఎవరో ఒత్తిడి చేస్తేనే ఆయన ఆస్తి అమ్మారు అనడంలో వాస్తవం లేదని ఈ వార్తలను ఖండించారు. ఇకపోతే చిరంజీవి ఫినిక్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఈ ప్రాపర్టీ కోసం మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించి భారీ ధరలు ఆఫర్ చేయడంతో ఈయన కూడా ఆ ప్రాపర్టీకి మంచి విలువ రావడంతోనే అమ్మినట్టు తెలుస్తోంది.అప్పట్లో చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీ ప్రస్తుతం కొన్ని కోట్ల విలువ చేయడంతో ఈ ఆస్తిని అమ్మినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ ఆస్తిని ఎలాంటి గొడవలు కారణంగా అమ్మలేదని కేవలం స్నేహపూర్వక వాతావరణంలో, ఇద్దరి అంగీకారంతోనే ఈ స్థలం అమ్మినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు.సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ ఆస్తి ఒత్తిడి కారణంగా అమ్మలేదని ఈ విషయంపై మెగా సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.