Jagan Case Accused Durga Rao: విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి పై దాడి చేయించారని ఈ దాడి వెనుక హత్య ప్రయత్నం ఉందని వైసిపి నేతలు ఆరోపణలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి ఘటనలో భాగంగా పలువురు అనుమానితులను పోలీసులు విచారించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే సతీష్ అనే వ్యక్తిని రిమాండ్ కి తరలించారు. అలాగే వేముల దుర్గారావు అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసి నాలుగు రోజులపాటు పోలీసుల కస్టడీలో పెట్టుకొని విడుదల చేశారు. ఈ విధంగా సతీష్ దుర్గారావు ఇద్దరూ కూడా విడుదలయ్యారు ఇలా నాలుగు రోజుల కస్టడీ తర్వాత బయటకు వచ్చినటువంటి దుర్గారావును మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
పోలీసులు తనని అరెస్టు చేసిన తర్వాత మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బోండా ఉమా కానీ ఇలా రాయి విసరమంటూ బలవంతం చేశారా అంటూ పదే పదే నన్ను ప్రశ్నలు వేసారని దుర్గారావు తెలిపారు. నాకు ఈ కేసుతో ఏ మాత్రం సంబంధం లేదని నేను చేయని తప్పుకు భయపడకుండా సమాధానం చెప్పడం వల్ల పోలీసులు నన్ను రెండు దెబ్బలు కొట్టి నేను చెప్పేది నిజమని నమ్మి నన్ను విడుదల చేశారని తెలిపారు.
ఒకవేళ నేను కనుక భయపడి ఉంటే చేయని తప్పుకు నేరం తనపై మోపి ఈపాటికి తనని జైల్లో పెట్టే వారని దుర్గారావు తెలిపారు. పోలీసు విచారణలో భాగంగా తాను నేరాన్ని ఒప్పుకోవాలని నాపై పోలీసులు బలవంతం చేశారు. కానీ చేయని తప్పుకు నేను భయపడకపోవడంతో నా తప్పు లేదని పోలీసులు నన్ను విడిచిపెట్టారంటూ ఈయన చెప్పడంతో బలవంతంగా బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం పోలీసులు చేశారంటూ పలువురు ఈ ఘటనపై పోలీసుల వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు.