CM Jagan: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు కుప్పంలో పర్యటించనున్నారు. నేడు కుప్పం పర్యటనలో భాగంగా ఆయన భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఎదుర్కొన్నటువంటి తాగునీటి సాగునీటి సమస్యకు నేడు జగన్మోహన్ రెడ్డి పులి స్టాప్ పెట్టబోతున్నారు. కృష్ణమ్మ జలాలను కుప్పానికి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చి అక్కడ ప్రజల తాగునీటి సాగునీటి కష్టాలను తీరుస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి నేడు ఉదయం 10:40 నిమిషాలకు ముఖ్యమంత్రి హెచ్ఎన్ ఎస్ఎస్ మీరు విడుదల సందర్భంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసే నీటినీ విడుదల చేశారు.11:40 కి గుండి శెట్టిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు చేరుకొని అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇలా కుప్పం నియోజకవర్గంలో సుమారు 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా సుమారు 6300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అలాగే కుప్పం పలమనేరు నియోజకవర్గాలలో 4.02 లక్షల జనాభాకు తాగునీటిని అందిస్తున్నారు.
ఈ విధంగా ఇన్ని రోజులు కుప్పం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తాగునీరు, ఆయకట్టు సాగునీరుకు జగన్మోహన్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపించారని తెలుస్తోంది. అనంత వెంకట్ రెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా 560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తిచేసి కుప్పం నియోజకవర్గం నేడు ఈ జలాలను రామకుప్పం మండలం రాజుపేట వద్ద ఈ జలాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేయబోతున్నారు.