CM KCR: ఏపీ పరువు తీసిన సీఎం కేసీఆర్.. ఏం జరిగిందంటే?

CM KCR: ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర సీఎం జగన్ కి అలాగే ఏపీ ప్రజలకు బాగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఏపీలో కరెంటు కోతులతో ఏపీ ప్రజలు విసిగిపోతున్నారు. అలాగే నిరుద్యోగులు సరైన ఉద్యోగ అవకాశాలు లేక తలలు పట్టుకుంటున్నారు. కాగా రాష్ట్ర విభజన సమయానికి ఏపీ కరెంటు కోతలతో అల్లాడిపోతుండేది. కానీ బాబు ఆ సమస్యను కేవలం రెండు మూడు నెలలోనే పరిష్కరించారు. ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు ఏపీలో ఎన్నడూ కరెంట్ కోతలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏపీలో ఎక్కడ చూసినా కరెంటు కోతలే. జగనన్నకు చెపుదాం కార్యక్రమంలో అత్యధికంగా వచ్చిన పిర్యాదులు ఇవే. అయితే కరెంట్ కష్టాలకు 15 రోజులలో పరిష్కరిస్తామని సమాధానం చెపుతున్నారు.

అంటే వర్షాలు పడితే విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. కనుక కరెంట్ కష్టాలు తీర్చేందుకు ఆ గడువు పెట్టుకొన్నట్లున్నారేమో? ఏపీ దుస్థితి గురించి జేపీ నడ్డా, అమిత్‌ షాలు కూడా చెప్పేశారు. ఇప్పటి వరకు తెలంగాణ మంత్రులు మాత్రమే జగన్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతుండేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ సిఎం కేసీఆర్‌ కూడా ఏపీని చీకట్లు ముసురుకొన్నాయంటూ ఏపీ సర్కార్ పై సెటైర్లు వేశారు. తాజాగా సోమవారం గద్వాల జిల్లాలో జరిగిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ, తుంగభద్రానది ఇటువైపు మన తెలంగాణ రాష్ట్రం 24 గంటలు విద్యుత్‌ వెలుగులతో ధగధగా వెలిగిపోతుంటే, ఇక్కడి 20-30 కిమీ దూరంలో అవతలి ఒడ్డున గల ఏపీ లోని కర్నూలులో, రాయలసీమ జిల్లాలలో అంతటా అంధకారం అలుముకొంది.

నిత్యం కరెంట్ కోతలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు ఈ పాలమూరు జిల్లాలో ఉపాధి లేక మన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు పొరుగునే ఉన్న ఏపీలోని రాయలసీమ జిల్లాలతో సహా అనేక రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం తెలంగాణకు వస్తున్నారు. మన రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే ఆ తుంగభద్రానది వంతెన దాటి ఓసారి కర్నూలులో తిరిగివస్తే మీకే అర్దమవుతుంది అని తెలిపారు కేసీఆర్‌. ఈవిదంగా ఎవరో మనల్ని వేలెత్తి చూపారని బాధపడటం కంటే అందరూ మనల్ని వేలెత్తి చూపేలా ఎందుకు ఉండిపోయామని ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి క్లిష్ట సమయంలోనే చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిన పెట్టి వడ్డించిన విస్తరిలా వైసీపీ ప్రభుత్వానికి అప్పగించారు. జగన్ కూడా అదే బాటలో ముందుకు సాగి ఉండి ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్‌ ఈ దుస్తితిలో ఉండేదే కాదు. టీడీపీ కూడా వేలెత్తి చూపగలిగేది కాదు.

తనపై పగ, ద్వేషంతో రాష్ట్రానికి నష్టం కలిగించవద్దని చంద్రబాబు పదేపదే వేడుకొన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ మాటను కూడా చెవికి ఎక్కించుకోలేదు. అమరావతి వద్దనుకొన్నా పర్వాలేదు. మూడు రాజధానులు ఏర్పాటు చేయకపోయినా పర్వాలేదు. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపించి ఉండి ఉంటే బాగుండేది. కానీ సంక్షేమ పధకాలకే ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన అన్ని రంగాలను పట్టించుకోకపోవడంతో ఈ దుస్తితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఏపీని చూపిస్తూ దాని కంటే మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది అంటూ గర్వంగా చెప్పుకొంటున్నాయి. ఇందుకు వారిని తిట్టుకోవడం అనవసరం. వేలెత్తి చూపుతున్నారని బాధ పడటం కూడా అనవసరం. అయితే ఇప్పటికే సమయం మించిపోయింది అంటూ ప్రభుత్వానికి జగన్ కి చురకలు అంటించారు కేసీఆర్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -