CM Revanth Reddy Challenges KTR: నువ్వు మొగోడివైతే ఒక్క సీటైనా గెలిచి చూపించు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

CM Revanth Reddy Challenges KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జన జాతర పేరిట నిర్వహించినటువంటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. అచ్చంపేట సభలో కేటీఆర్ రేవంత్ రెడ్డి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలకు జన జాతర కార్యక్రమంలో రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… నువ్వు మొగోడివి అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీట్ అయినా గెలిచి చూపించండి.. నీ అయ్యా నువ్వు వస్తావో మీ అయ్యా వస్తాడో రమ్మను మా కార్యకర్తలు చూసుకుంటారు అంటూ సవాల్ విసిరారు. మీ ప్రభుత్వ కూలిపోతుంది అంటే వారిని ఏకంగా చెట్టుకు కట్టేసి కొడతారు. అల్లాటప్పగాళ్లకు కాదు సీఎం పేరు చెప్పి కుర్చీలో కూర్చోలేదు.

కార్యకర్తలుగా జెండాలు మోసాము. అక్రమ అరెస్టులను ఎదుర్కొన్నాము, జైలలో మగ్గిపోయాము. ఎన్నో పోరాటాలు చేసి నీ అయ్యా నిన్ను నీ బావను బొంద పెట్టి ఈ కుర్చీలో కూర్చున్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయ్య పేరు తాత పేరు చెబితే ఈ కుర్చీ వచ్చినది కాదు నల్లమల అడవుల నుంచి నీలాంటి వాళ్ళను తొక్కుకుంటూ పోతే ఈ కుర్చీ వచ్చినది. కార్యకర్తలు అండగా ఉన్నంతవరకు నువ్వు కాదు ఆ దేవుడు వచ్చిన ఈ కుర్చీను తాకలేరు అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -