Lakshmi Parvati: ఎన్టీఆర్ ను చంపిన వారితో నాణెం విడుదలా.. లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Lakshmi Parvati: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలోభాగంగా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సతీమణి అయినటువంటి లక్ష్మీపార్వతి దూరంగా ఉన్నారు. ఆమెకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడం అదేవిధంగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

ఇలా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి తనని ఆహ్వానించకపోవడంపై లక్ష్మీపార్వతి మీడియా సమావేశంలో భాగంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భార్య హోదాలో తనకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని రాష్ట్రపతి ముర్ముకు వైసీపీ నేత లక్ష్మీపార్వతి లేఖ కూడా రాశారు. అయినా సరే, ఈ కార్యక్రమానికి ఆమెకు ఆహ్వానం అందలేదు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఎన్టీఆర్ భార్యగా నన్ను ఈ కార్యక్రమానికి పిలవకపోవడం అన్యాయమని తెలిపారు.

 

ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వారి చేతుల మీదుగా ఆయన స్మారక నాణెం విడుదల చేయడం బాధాకరమని తెలిపారు. ఇక ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్యగా నన్ను ఆహ్వానించకపోవడం తప్పని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఆయన భార్యగా ఈ నాణెం అందుకునే అర్హత నాకు మాత్రమే ఉందని వారికి ఎవరికీ లేదు అంటూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పట్ల లక్ష్మీపార్వతి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఇక పురందేశ్వరి గురించి కూడా మాట్లాడుతూ పురందేశ్వరి ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడుకి సహాయం చేశారని ఈమె ఆరోపణలు చేశారు అదేవిధంగా తాను రాజకీయాలలో ఏ నియోజకవర్గంలో అయితే నిలబడతారు తాను కూడా అదే నియోజకవర్గంలో పర్యటిస్తూ పురందేశ్వరికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను అంటూ లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -