Collection Details: కలెక్షన్లలో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ‘జిన్నా’.. ‘సర్దార్‌’దే పైచేయి!!

Collection Details: దీపావళి కానుకగా ఈ నెల 21వ తేదీన నాలుగు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఇందులో మా అధ్యక్షుడు, స్టార్ హీరో మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ మూవీ కూడా ఉంది. ఈ సినిమాను మంచు విష్ణు తన సొంత ప్రొడక్షన్‌ హౌస్‌లో నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం ఢీలా పడింది. ఈ సినిమాను మేకర్స్ తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు ఎంతో హడావుడి చేశారు. కానీ ఆ తర్వాత హడావుడి కనిపించలేదు. విమర్శకులు కూడా ఘోరమైన రివ్యూ ఇవ్వలేదు. కానీ ట్రోలర్స్, మీమర్స్ వల్ల ప్రేక్షకులు సినిమా చూడటాన్ని మొత్తానికి అవాయిడ్ చేసేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జిన్నా దారుణంగా పరాజయం పొందింది.

జిన్నా.. తొలి రోజు రూ.12 లక్షలు, రెండో రోజు రూ.10 లక్షలు, మూడో రోజు రూ.8 లక్షలు, నాలుగో రోజు రూ.11 లక్షలు మాత్రమే రాబట్టగలిగింది. గ్రాస్ మొత్తంగా కేవలం రూ.75 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అయితే మరోవైపు కన్నడ సినిమా ‘కాంతార’ మాత్రం కలెక్షన్ల విషయంలో దూసుకెళ్తోంది. నిన్న ఒక్కరోజే రూ.1.30 కోట్లు టర్నోవర్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పాటు హీరో కార్తి నటించిన సినిమా ‘సర్దార్’ కలెక్షన్ల విషయంలో పై చేయి సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం నాలుగు రోజుల్లో రూ.4.80 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ.8 కోట్లు కలెక్ట్ చేసింది. విక్టరీ వెంకటేశ్-విశ్వక్‌ సేన్ హీరోలుగా నటించిన సినిమా ‘ఓరి దేవుడా’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 4 రోజుల్లో రూ.3.20 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.3.82 కోట్లు రాబట్టింది.

అలాగే హీరో శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ సినిమా కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.2.37 కోట్లు రాబట్టింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ను రూ.7 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. అయితే ఇంకా రూ.4.63 కోట్లు సాధిస్తేనే సేఫ్ జోన్‌కి చేరుకున్నట్లని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -