Gujarat: ఇంట్లో బాయ్ ఫ్రెండ్ తో కూతురు.. ఆ తరువాత?

Gujarat: ప్రస్తుత రోజుల్లో యువత ప్రేమ అనే ఒక పిచ్చి మోజులో పడి ఏం చేస్తున్నారో,ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తూ వారి జీవితాలలో నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. చదువులను సైతం పక్కన పెట్టి ప్రేమ పేరుతో చెక్కాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. సినిమాలు షికార్లు తిరగడం తీరా గర్భం దాల్చడంతో మొహం చాటేయడం ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక యువతి ఏకంగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.

ప్రియుడితో రూమ్ లో ఏకాంతంగా ఉన్న సమయంలో సడన్ గా ఆమె తల్లి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.. గుజరాత్ జునాగఢ్ జిల్లాలోని ఇవ్నాగర్ గ్రామం. ఇక్కడే దక్షా బమనియా అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు మీనాక్షి అనే 19 ఏళ్ళ కూతురు కూడా ఉంది. ఈ యువతి ఈ మధ్యే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించింది. అంతవరకు బాగానే ఉన్నా ఈమె తల్లిదండ్రులకు తెలియకుండా స్థానికంగా ఉండే ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ వచ్చింది. సమయం దొరికినప్పుడల్లా చదువు పేరుతో బయటకు వెళ్లి ప్రియుడితో తిరుగుతూ ఎంజాయ్ చేసేది. ఇటీవల తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో మీనాక్షి తన ప్రియుడిని ఏకంగా ఇంటికే రప్పించుకుంది.

 

ప్రియుడు రాగానే ఇంట్లో బెడ్ రూంలో చేయాల్సినవి అన్నీ చేసేశారు. ఇక ఇదే సమయంలోనే మీనాక్షి తల్లి సడెన్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కూతురుని ప్రియుడితో చూడకూడని స్థితిలో చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ అయ్యింది. దీంతో వెంటనే మీనాక్షి ప్రియుడు ఇంట్లో నుంచి పరారయ్యాడు. తల్లి మాత్రం కూతురిపై మాటలతో దాడి చేసింది. ఈ విషయాన్ని నాన్నకు చెప్పద్దంటూ మీనాక్షి తల్లిని వేడుకుంది. అయినా మీనాక్షికి నమ్మకం కుదరలేదు. దీంతో ఆ యువతికి ఏం చేయాలో తెలియక తల్లిని హత్య చేయాలని భావించింది. తాను అనుకున్నట్లే ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో తల్లిని కొట్టి దారుణంగా హత్య చేసింది.

 

ఇక సాయంత్రం మీనాక్షి తండ్రి ఇంటికి వచ్చి చూడగా భార్య దక్షా బమనియా రక్తపు మడుగులో పడి చనిపోయి కనిపించింది. అతడు షాక్ గురై ఏం జరిగిందో తెలియక వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక పోలీసులు విచారించగా మీనాక్షి అసలు నిజాన్ని ఒప్పుకుంది. దాంతో పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -