Sai Tej: భయాన్ని తగ్గించుకోవడానికి మెగా హీరో సాయితేజ్ అలా చేశాడా?

Sai Tej: మెగా హీరో సాయి ధరంతేజ్ బైక్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు పాలైన సంగతి మనకు తెలిసిందే. దాదాపు 12 రోజులపాటు కోమాలోకి వెళ్లిపోయినటువంటి సాయి ధరంతేజ్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమించింది అయితే ఈయనకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తూ తనని ప్రాణాలతో కాపాడారు. ఇలా బైకు ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి మరణం అంచుల దాకా వెళ్లి వెనక్కి తిరిగి వస్తే మరోసారి బైక్ ఎక్కడానికి భయపడతారు.

ఈ క్రమంలోనే సాయి ధరంతేజ్ సైతం ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత తాను తిరిగి బైక్ ఎక్కాలంటే చాలా భయపడ్డానని తెలిపారు అయితే ఈ భయం నుంచి తాను బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు.అయితే తనకి ఈ బైక్ అనే భయం పోవడానికి కారణం తన అమ్మ అని ఈ సందర్భంగా సాయి తేజ్ వెల్లడించారు.

 

తాను ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత తన తల్లి స్వయంగా బైక్ కీస్ ఇచ్చి బైక్ నడపమని చెప్పారు అయితే తాను మొదట తన ఇంటి పార్కింగ్ ఏరియాలోనే మెల్లిగా బైక్ నడిపే వాడిని ఇలా పార్కింగ్ ఏరియాలో నడుపుతూ ధైర్యం వచ్చిన తర్వాత కాస్త దూరం బయటకు వెళ్లేవాడిని. ఇలా తనకు బైక్ అనే భయం నుంచి బయటపడ్డానని ప్రస్తుతం బాగా బైక్ నడుపుతున్నానని ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

ఇక మీరు ప్రమాదానికి గురైన బైక్ ఏం చేశారు అనే విషయం గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు సాయి తేజ్ సమాధానం చెబుతూ ఆ బైక్ నాకు మాతాతయ్య కొనిచ్చారు. అయితే ప్రమాదం తర్వాత ఆ బైక్ పనికి రాకుండా పోవడంతో దానిని అమ్మేయాల్సి వచ్చిందని దాని స్థానంలో మరొక బైక్ కొనుక్కున్నాను అంటూ ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -