Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి కలిసి సత్యా అనే ఒక చిన్న షార్ట్ ఫిలిం లో కనిపించారు. సీన్ కట్ చేస్తే మంగళవారం కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర నటించిన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్ కి తేజు గెస్ట్ గా వచ్చాడు.

ఆ ఈవెంట్లో స్వాతి, తేజుల బాండింగ్ చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. వాళ్ల బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే తేజు ని స్వాతి రేయ్, వాడు అంటూ సంబోధించింది. ఇది చూసిన జనాలు అందరూ ఏంటి ఒక షార్ట్ ఫిలిం కి అంత క్లోజ్ అయిపోయారు అంటూ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టారు.అయితే ఇక్కడే తెలియని ట్విస్ట్ ఒకటి బయటపడింది.

అదేంటంటే తేజు, కలర్స్ స్వాతి ఇద్దరూ డిగ్రీలో క్లాస్మేట్స్ అంట. ఈ విషయాన్ని స్వాతి స్వయంగా చెప్పుకొచ్చింది. తేజు కూడా ఈ విషయాన్ని చెప్పకనే స్టేజ్ మీద చెప్పాడు. తాను ఇండస్ట్రీకి తొందరగా రావడం వల్ల తేజ కన్నా పెద్దదాన్ని అనుకుంటారు కానీ నిజానికి నేను, తేజ ఇద్దరం క్లాస్మేట్స్. ఇద్దరి అక్షరాలు ఎస్ తో స్టార్ట్ అవ్వటం వల్ల ప్రాక్టికల్స్ లో ఇద్దరం పక్కపక్కనే పడేవాళ్ళం అని తెలిపింది. తేజు నా పేపర్లో చూసి కాపీ కొట్టి రాసి పాస్ అయ్యే వాడని సరదాగా చెప్పుకొచ్చింది స్వాతి.

అయితే అదే సమయంలో తేజ్ మైక్ తీసుకుని స్వాతి తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని అయితే అన్ని పరీక్షల్లోని అసలు చూపించేది కాదని,ల్యాబ్ మొత్తం చూపించేసి చివర్లో రిజల్ట్ చెప్పేది కాదని నవ్వుతూ చెప్పాడు. అయితే వీళ్ళిద్దరి బాండింగ్ చూసిన ప్రేక్షకులు మాత్రం వీళ్ళు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఇన్నాళ్లు బయట పడకపోవడం విశేషమే అని చెవులు కొరుక్కుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -