Trivikram: నమ్మిన వ్యక్తిని త్రివిక్రమ్ శ్రీనివాస్ ముంచేశారా.. ఏం జరిగిందంటే?

Trivikram: ప్రముఖ దర్శకుడు మరియు రచయిత అయిన త్రివిక్రమ్ ఈ స్థాయిలో ఉన్నారు అంటే తన రాతల వల్లే అని అనడంతో ఎటువంటి లేదు. దర్శకుడు కాకముందు త్రివిక్రమ్ ఎన్నో సినిమాలకు కథలు రాసి మాటలు అందించారు. అయితే దర్శకుడుగా మారేందుకు మొట్టమొదటిగా “అతడు” సినిమాతో ఎంట్రీ ఇద్దాం అనుకున్నారట. దీనికోసం ముందు పవన్ కళ్యాణ్ కి కథ చెప్పారట కథ వింటూ పవన్ కళ్యాణ్ పడుకుండిపోవడంతో మహేష్ బాబు కి వచ్చి కథ చెప్పారు.మహేష్ కి కథ చాలా నచ్చింది కానీ అప్పటికే నాని వంటి చిత్రాలలో బిజీగా ఉండి తర్వాత చేద్దాము అని అన్నారట.

ఈ గ్యాప్ లో ఖాళీగా ఉండడం ఎందుకు అని నువ్వు నేను అనే సినిమా తరుణ్ శ్రీయా లతో పెట్టి తీశారు త్రివిక్రమ్. ఈ సినిమా కూడా బానే ఆడింది కానీ ఈ గ్యాప్ లో చిన్న హీరోతో సినిమా తీయడం మహేష్ కి నచ్చలేదట. అందుకే త్రివిక్రమ్ ని వెంట తిప్పుకున్నారు. అదే సమయంలో ఒక్కడు లాంటిది మంచి హిట్ కొట్టిన గుణశేఖర్ మహేష్ బాబుతో టచ్ లో ఉండేవారట.ఒక మీటింగ్లో త్రివిక్రమ్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ కథను నమ్మండి అని బాబు తో అన్నారట.

 

అప్పుడు మహేష్ బాబు తిరిగి సినిమాని ఒప్పుకోవడంతో ఇది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయిందంటే అందులో గుణశేఖర్ చేయ కూడా ఉంది.అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే రానా దగ్గుబాటి నటిస్తున్న హిరణ్య కశ్యప అనే సినిమా గురించి కామిక్ కాన్ లో వెల్లడించాడు. ఈ సినిమాకి ముందు గుణశేఖర్ ని అనుకున్నారట కానీ ఇది చేతులు మారింది ఇప్పుడు త్రివిక్రమ్ దీనికి కథను రాశారు.

 

దీని గురించి గుణశేఖర్ మాట్లాడుతూ ఒకటి ట్వీట్ ని రాశాడు. “దేవుడిని మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తించాలి.అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది” అని వివరణ ఇచ్చారు. అయితే గుణశేఖర్ సినిమాలో నుంచి బయటికి రావడానికి కారణం ఏంటో తెలియదు తను ఇటీవల తీసిన శాకుంతలా కూడా పెద్ద డిజాస్టర్ గా మారింది. అందుకే ఇందులో కూడా గుణశేఖర్ ని తేసేసార? అని వార్తలు వినిపిస్తున్నాయి. మరీ చిత్రానికి దర్శకుడు ఎవరో త్వరలోనే తెలియనున్నది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -