Adipurush: ఆదిపురుష్ సినిమాలో ఇది గమనించారా..అసలేం జరిగిందంటే?

Adipurush: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. ఇందులో కృతి సనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కాగా గత ఏడాది విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ పై భారీగా నెగిటివ్ కామెంట్స్ ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొత్తం కార్టూన్ లాగా ఉంది అంటూ భారీగా ట్రోలింగ్స్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ను జనాలు బాగా టార్గెట్ చేసి సోషల్ మీడియా ట్రౌలింగ్స్ తో ఆడుకున్నారు. దీంతో దెబ్బకు సినీ బృందం స్పందించి తప్పులు జాగ్రత్తగా సరిచేసి మరోసారి ట్రైలర్ ను వదిలారు.

 

ఇక రెండోసారి వచ్చిన ట్రైలర్ పర్వాలేదు అన్నట్లుగా అనిపించింది. అంతేకాకుండా లుక్స్ కూడా బాగానే మార్చారు. దీంతో జనాలు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచుకున్నారు. తెలిసిన కథ అయినప్పటికీ కూడా ఈ సినిమా మంచి రికార్డు సొంతం చేసుకుంటుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ కలలు కన్నారు. కానీ తాజాగా సినిమా విడుదల కావటంతో బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా ఆ సినిమాలో అల్లు అర్జున్ వచ్చాడు అంటూ, జీసస్ కూడా ఉన్నాడు అంటూ బాగా ట్రోల్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు ట్రోలర్స్. ఇందులో వానర సైన్యంలో ఉన్న ఒక వ్యక్తి అచ్చం అల్లు అర్జున్ లాగా ఉన్నాడని బాగా ట్రోల్ చేయటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా అందులో రాఘవ పాత్రలో కనిపించిన ప్రభాస్ ని కూడా కొందరు బాగా టార్గెట్ చేసి ఆయన లుక్ పట్ల కూడా ట్రోల్ చేస్తున్నారు. అందులో ప్రభాస్ అచ్చం జీసస్ లాగా ఉన్నాడు అని అనడమే కాకుండా ఆ లుక్ లో ఉన్న ప్రభాస్ ను అచ్చం జీసస్ లాగా తయారు చేసి ఆది పురుష్ లో జీసస్ తో పాటు అల్లు అర్జున్ కూడా ఉన్నాడు అంటూ బాగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ట్రోల్స్ పట్ల బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -