Dil Raju: ఇటీవల విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ గురించి.. ఆ టీజర్ ఎదుర్కొంటున్న విమర్శలు గురించి మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ టీజర్ చాలా వివాదాలను కూడా తట్టి లేపుతుంది. అయితే హైదరాబాదులో ఏఎంబి సినిమాస్ లో ఆది పురుష్ 3డి టీజర్ ను విడుదల చేశారు. పెద్ద స్క్రీన్ లో ఆది పురుష్ 3డి టీజర్ చాలా బాగుందని చాలామంది మీడియా మిత్రులు తెలుపుతున్నారు.
ఇక ఈ ప్రెస్ మీట్ కు టాలీవుడ్ పెద్ద నిర్మాత దిల్ రాజు కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా టీజర్ విడుదల అయినప్పుడు ఫోన్ లో చూసాను. అప్పుడే ప్రభాస్ కి కూడా ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను.. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఆ టీజర్ ను ఫోన్లో కూడా చూశాను అప్పుడు ఆ టీజర్ ఇంకా బాగా అనిపించింది అని తెలిపాడు.
ఇక ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై త్రీడీలో చూశాను. ఇది నాకు ఇంకా అద్భుతంగా అనిపించింది. ప్రభాస్ ను , సినిమాను ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి నేను ఒకటే చెబుతున్నాను. బాహుబలి సినిమా చేసినప్పుడు ప్రభాస్ శివలింగం ఎత్తే ప్లేస్ లో జెండు బామ్ పెట్టి మొదటి రెండు రోజులు ట్రోల్ చేశారు. కానీ నేను సినిమా చూసిన నైట్ ప్రభాస్ కి ఫోన్ చేసి సినిమా సూపర్ హిట్ అని చెప్పాను. అంతేకాకుండా ఈ విషయంలో ప్రభాస్ ను తడిబట్ట వేసుకొని పడుకోమని చెప్పాను.
ఇప్పుడు అదే తరహాలో ఇదొక అనుభవం, ఫోన్లో చూసి ఎక్కడో చూసి సినిమా అంచనాలు వేయలేం. ఇవన్నీ బిగ్ స్క్రీన్ సినిమాలు థియేటర్లో అందరితోపాటు చూస్తేనే ఈ సినిమా ఏంటో అర్థం అవుతుందని అన్నట్లు నిర్మాత దిల్ రాజు తెలియజేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రభాస్ అభిమానులు ఒక రేంజ్ లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.