Taraka Ratna: తారకరత్న ఆత్మ శాంతించాలంటే ఆ పని చేయాల్సిందేనా?

Taraka Ratna: నందమూరి వారసుడు, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు తారకరత్న మరణించి 15 రోజులు కావడానికి వస్తుంది. ఇక ఈయన మరణంను ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం ఆయన ఆలోచన నుండి బయటికి రాలేక పోతుంది. ఆయన మరణాన్ని తట్టుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తుంది.


ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తారకరత్న.. ఆ తర్వాత 9 సినిమాలకు సైన్ చేసి కొత్త రికార్డు అందుకున్నాడు. కానీ హీరోగా స్టార్ హోదాకు చేరుకోలేకపోయాడు. ఇక కొంతకాలానికి విలన్ క్యారెక్టర్ తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇక నటుడుగా ఉన్న సమయంలోనే.. కుటుంబ సభ్యులను ఎదిరించి తాను ప్రేమించిన అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకొని కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాడు.

ఆ మధ్యనే కాస్త మాటలు కలవడంతో.. ఇక తారకరత్న రాజకీయపరంగా కూడా ప్రచారం చేయాలని అనుకున్నాడు. అలా నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొనగా ఆ సమయంలో తారకరత్నకి గుండెపోటు రావటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అలా కొన్ని రోజులపాటు హాస్పిటల్ లో చికిత్స పొంది చివరికి ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు.

39 ఏళ్ల వయసులోనే ఆయన శివైక్యం చెందటంతో అందరూ షాక్ అయ్యారు. ఇక చిన్న కర్మ వంటి కార్యక్రమాలు కూడా ఆయన కుటుంబ సభ్యులు దగ్గరుండి చేశారు. అయితే ఆయన ఆత్మ శాంతించడానికి మరొక విషయం ఉందని తెలుస్తుంది. అదేంటంటే తారకరత్న అస్థికలు కాశీలో కలపడం. ఈ ఒక్క పని చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుందని ఆయన అభిమానులతో పాటు కొంతమంది కుటుంబ సభ్యులు కూడా అంటున్నట్లు తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -