Balayya-Roja: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రోజా, అగ్ర హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరిదీ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. గతంలో వీరు ఇద్దరు కలిసి నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. బాలకృష్ణ, విజయశాంతి తర్వాత బాలయ్య,రోజా కాంబినేషన్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వీరిద్దరూ కలిసి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన భైరవద్వీపం సినిమాలో తొలిసారిగా ఇచ్చిన విషయం తెలిసిందే.
నటిగా రోజా కెరీర్ను మలుపు తిప్పింది కూడా ఈ సినిమా అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన గాండీవం సినిమాలోని వీరు నటించారు. ఇక కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా బొబ్బిలి సింహం సినిమాలో బాలకృష్ణ, రోజా, మీనా నటించిన ఈ సినిమాలో రోజా కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక బాలకృష్ణ, రోజా కలిసి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాతో పెట్టుకోకు సినిమాలో నాలుగోసారి నటించారు.
ఇక ఐదోసారి వీరిద్దరూ కలిసి శ్రీకృష్ణార్జున విజయం సినిమాలో నటించారు.
ఈ సినిమాకు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. రోజా ద్రౌపది పాత్రలో నటించారు. మరోవైపు బాలకృష్ణ అర్జునుడిగా, శ్రీకృష్ణుడిగా రెండు పాత్రలలో మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన రిజల్ట్ అందుకోలేదు. ఈ సినిమాలో శ్రీకృష్ణుడి చెల్లెలుగా, అర్జునుడి భార్యగా రోజా నటించారు. అంటే శ్రీకృష్ణుడి చెల్లెలు పాత్రలో ద్రౌపదిగా రోజా నటించారు. అలా బాలయ్య, రోజా సినిమాలో జోడీగాను, ఇటు అన్నా చెల్లిగాను నటించారు. ఇక ఆరోసారి వీరిద్దరు కలిసి పెద్దన్నయ్య సినిమాలో నటించారు. క్లైమాక్స్లో వీరిద్దరు చనిపోయే పాత్రలో నటించారు. ఇక ఏడోసారి వీరు సుల్తాన్ సినిమాలో నటించారు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుండగా రోజా పొలిటికల్ లో బిజీ బిజీగా ఉంది.